Ayodhya Ramaiah : అయోధ్య రామయ్య దర్శనం కోసం రోజూ లక్షన్నర మంది
- By Latha Suma Published Date - 01:26 PM, Wed - 13 March 24
Ayodhya Ramaiah : యూపీలోని అయోధ్యలో ఇటీవల రామ్లల్లా మందిరాన్ని(Shri Ram Janmabhoomi Mandir) ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆలయానికి భక్తుల(Devotees) తాకిడి పెరిగింది. రామ్లల్లాను ప్రతి రోజూ సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటున్నారని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర( ram janmbhoomi teerth kshetra )తెలిపింది. ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఆ విషయాన్ని చెప్పింది. భారీ సంఖ్యలో రాముడి దర్శనం కోసం వస్తున్న పర్యాటకులకు ట్రస్టు కొన్ని సూచనలు చేసింది. రామ మందిరాన్ని ఉదయం 6.30 నిమిషాల నుంచి రాత్రి 9.30 నిమిషాల వరకు తెరిచి ఉంచుతున్నట్లు తెలిపింది. చాలా సలువుగా, వీలైన రీతిలో దర్శనం చేసుకోవచ్చు అని, సుమారు 60 నుంచి 75 నిమిషాల్లోనే దర్శనం పూర్తి అవుతుందని ట్రస్టు పేర్కొన్నది.
For the kind attention of all devotees visiting the Shri Ram Janmabhoomi Mandir:
The Shri Ram Janmabhoomi Mandir is witnessing an average of 1 to 1.5 lakh pilgrims daily.
Devotees can enter the Shri Ram Janmabhoomi Mandir for Darshan from 6:30 AM to 9:30 PM.
The entire process… pic.twitter.com/F41JMgyIBr
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 13, 2024
We’re now on WhatsApp. Click to Join.
ఆలయానికి వస్తున్న భక్తులు తమతో మొబైల్ ఫోన్లు, పర్సులు తీసుకురాకూడదని ట్రస్టు తెలిపింది. పువ్వులు, మాలలు, ప్రసాదాలను కూడా తీసుకురావద్దు అని తన సూచనలో వెల్లడించింది. మంగళహారతి ఉదయం 4 గంటలకు, శృంగార్ హారతి 6.15 నిమిషాలకు, శయన్ హారతి రాత్రి 10 గంటలకు నిర్వహించనున్నారు. హారతి కోసం ఎంట్రీ పాసులు తప్పనిసరి.
Read Also: Telangana : బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా..?
Related News
Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే
Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుం�