Astrology: ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు.. నరదృష్టితోపాటు ఆ సమస్యలన్నీ పరార్?
మామూలుగా మనం ఎండు మిరపకాయలను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు పోపుగా ఉపయోగిస్తే మరికొందరు కారంపొడి వంటివి చేసుకోవడానికి ఈ ఎం
- By Nakshatra Published Date - 03:00 PM, Thu - 15 February 24
మామూలుగా మనం ఎండు మిరపకాయలను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు పోపుగా ఉపయోగిస్తే మరికొందరు కారంపొడి వంటివి చేసుకోవడానికి ఈ ఎండు మిరపకాయలను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎండు మిరపకాయలు ఉపయోగపడతాయి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, చెడు దృష్టి నివారణకు కూడా అంతగానే ఉపయోగపడతాయి. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఎండు మిరపకాయలను ఉపయోగించడం ద్వారా చెడు దృష్టి ని త్వరగా పోగొట్టుకోవచ్చు.
ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చు. అంతేకాదు ఏదైనా పనిలో విజయం సాధించాలంటే కూడా ఎండు మిరప కాయలతో వాస్తు నివారణలు చేయడం మంచిది. అయితే చాలామంది నరదృష్టి దోషాలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి నరదృష్టి దోషాల వల్ల జీవితంలో అన్నీఉన్నా రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నరదృష్టి ఉన్నప్పుడు చేసేపని సవ్యంగా జరగదు. అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నరదృష్టిని తొలగించుకోవడానికి, నరదృష్టి నుంచి ఉపశమనం పొందడానికి 7ఎండు మిరపకాయలు తీసుకొని వాటిని తలపై నుండి ఏడుసార్లు నేరుగా, మళ్లీ ఏడుసార్లు రివర్స్ లో తిప్పి ఆ ఏడు మిరపకాయలను మంటలో వేయాలి.
ఇలా చేయడం వల్ల నరదృష్టి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఏదైనా పనిచేయాలని భావించి ఆ పని చేయడానికి ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కూడా ఎండు మిరపకాయలు మంచి రెమెడీ గా చెప్పవచ్చు. దీనికోసం చేయవలసిందల్లా ఏదైనా పనికి బయటకు వెళుతున్నప్పుడు ఐదు ఎండుమిరపకాయలు తీసుకొని ఇంటికి గుమ్మం ముందు ఉంచి ఆపై ఏదైనా చేయాల్సిన పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్లాలి. ఎండు మిరపకాయలు ప్రతికూల ప్రభావాలను తగ్గించి, సానుకూల ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు ఇంట్లో బాగా డబ్బులు ఉండాలంటే, ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం 7 ఎండు మిరపకాయలను ఒక గుడ్డలో కట్టి మీరు డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ దానిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు దుబారా తగ్గుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి.
Related News
Lizard Astrology for Female: స్త్రీ శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది?
బల్లి అనగానే భయంతో ఆమడ దూరం వెళ్ళిపోతాం. పైగా బల్లి మనమీధపడితే ఒళ్ళు జలదరింపు మాట అటుంచితే ఎన్నెన్నో అనుమానాలు.. ఏదో అపచారం జరిగిపోతుందని భయాందోళనలు .. చివరకి కథ కంచి వరకు చేరుతుంది. అక్కడకు వెళ్లి బంగారు బల్లి ముట్టుకుని వచ్చేవరకు మనశ్శాంతి ఉందదు