Article 370 Abrogation: అమర్నాథ్ యాత్ర వాయిదా, ఎందుకో తెలుసా?
ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదో వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ సమయంలో అమర్నాథ్ యాత్ర పాటు వాయిదా వేశారు.
- Author : Praveen Aluthuru
Date : 05-08-2024 - 10:35 IST
Published By : Hashtagu Telugu Desk
Article 370 Abrogation: జమ్మూ కాశ్మీర్లో సెక్షన్ 370ని తొలగించి నేటికి ఐదేళ్లు. ఐదవ వార్షికోత్సవం సందర్భంగా లోయలో భద్రతా ఏర్పాట్లను పెంచారు. అంతేకాకుండా ప్రతి సందులో భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)ను ఒకరోజు వాయిదా వేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదో వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ సమయంలో ప్రతి వ్యక్తిని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. గత 36 రోజుల్లో 4.90 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్ర చేపట్టారు. ఆదివారం 1,112 మంది యాత్రికుల కొత్త బ్యాచ్ జమ్మూ నుండి కాశ్మీర్కు బయలుదేరింది.(Article 370)
జమ్మూ నుండి రెండు బేస్ క్యాంపులకు 350 కి.మీ కంటే ఎక్కువ పొడవైన మార్గంలో యాత్రికులు సురక్షితంగా వెళ్లేందుకు పోలీసులు మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ తో సహా పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు 24 గంటలూ విధులు నిర్వహిస్తున్నాయి. అమర్నాథ్ యాత్ర 29 జూన్ 2024న ప్రారంభమైంది. 52 రోజుల తర్వాత ఆగస్ట్ 19న శ్రావణ పూర్ణిమ మరియు రక్షాబంధన్ పండుగతో ముగుస్తుంది.
Also Read: Cash Withdrawal: బ్రిటన్లో కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్..!