Shah Rukh Khan: మక్కాలో షారూఖ్ ఖాన్ ఉమ్రా యాత్ర
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా యాత్ర చేశారు.
- By Gopichand Published Date - 08:24 AM, Fri - 2 December 22
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా యాత్ర చేశారు. షారుఖ్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియాలోని జరిగిన సినిమా షూటింగులో పాల్గొన్నారు. తన షూటింగ్ పూర్తయిన తర్వాత సూపర్ స్టార్ షారూఖ్ మక్కాలో భక్తి శ్రద్ధలతో ఉమ్రా యాత్ర చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ఒక జర్నలిస్ట్ షారూఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా చేస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.‘‘బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ రోజు మక్కాలో ఉమ్రా చేశారు. అల్లాహ్ అతని ఉమ్రాను అంగీకరించాలి ఆమీన్’’అంటూ సౌదీ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.
సౌదీ అరేబియాలోని సుందరమైన లొకేషన్లో రాజ్కుమార్ హిరానీ డుంకీ సినిమా షూటింగులో షారూఖ్ పాల్గొన్నారు. మక్కాలో షారూఖ్ ఉమ్రా యాత్ర ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. డుంకీ సినిమా షూట్ షెడ్యూల్ను చాలా సాఫీగా చేయడంలో సహకరించిన సౌదీఅరేబియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, టీమ్,అందరికీ ధన్యవాదాలు తెలిపే వీడియోను షారూఖ్ పంచుకున్నారు. షారుఖ్ అంతకముందు ఓ వీడియోను పంచుకున్నాడు.
అందులో తన చిత్రం డుంకీ షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించాడు. చిత్ర బృందం, నటీనటులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దేశంలో షూటింగ్లో చాలా సరదాగా గడిచిపోయిందని చెప్పారు. దేశంలో షూటింగ్కు అనుమతించినందుకు సౌదీ అరేబియా మంత్రిత్వ శాఖకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. షారుఖ్ పఠాన్, జవాన్లు చిత్రాలు కూడా విడుదలకు రెడీ అయ్యాయి. పఠాన్లో షారూఖ్తో పాటు దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన పఠాన్ చిత్ర టీజర్కు మంచి స్పందన వచ్చింది. మరోవైపు జవాన్ చిత్రంలో షారుఖ్తో పాటు రష్మిక మందన్న ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.
Related News
Ram : అక్కడ మార్కెట్ చూసుకుని భారీగా పెంచేసిన రామ్.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ది వారియర్, స్కంద సినిమాతో నిరాశపరచిన రామ్ డబుల్ ఇస్మార్ట్ తో