Devara: ఎన్టీఆర్ దేవర నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే!
- By Sailaja Reddy Published Date - 12:40 PM, Tue - 19 March 24
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
ఆ వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తి పెంచారు. ఇక దేవర సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. శ్రీకాంత్, షైన్ చామ్ టాకో.. పలువురు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దేవర సినిమా సముద్రం ఒడ్డున ఉండే ఊళ్లు, సముద్రపు దొంగల కథాంశంతో ఉండబోతుందని సమాచారం.
ఇప్పటికే దేవర షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాయి. గోవా, గోకర్ణ, రామోజీ ఫిలిం సిటీ.. వంటి ప్లేస్ లలో షూటింగ్ చేశాయి. దేవర సముద్రపు ఒడ్డున జరిగే కథ కావడంతో ఎక్కువగా సముద్రవు ఒద్దు ఉన్న ప్లేసెస్ లో షూట్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి మొదలు కాబోతుంది. గోవాలో దేవర నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి జరగనుందని సమాచారం. ఎన్టీఆర్, జాన్వీపై ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ షూట్ కోసం నిన్న సాయంత్రమే ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గోవాకు వెళ్లారు. ఇక దేవర సినిమా నుంచి మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఒక పాట రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ గోవాకు వెళ్తున్న ఫోటో వైరల్ గా మారింది.
Related News
Naveen Chandra: నవీన్ చంద్రకు అరుదైన గౌరవం.. తెలుగు హీరోకు ప్రతిష్టాత్మక అవార్డ్
Naveen Chandra: ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో ఆయన నటనకు గుర్తింపు లభించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ పితామహుడు పేరు మీద దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం వివిధ కేటగిరీల్లో చలనచిత్ర రంగంలో ఔన్నత్యాన్ని జరుపుకుంటుంది. ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఈ అ�