Exclusive: భారీ అంచనాలు రేపుతున్న SSMB29, రాజమౌళి-మహేశ్ సినిమాలో 3 బాలీవుడ్ స్టార్స్
రాజమౌళి, మహేశ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే భారీ అంచనాలను నెలకొల్పుతోంది.
- By Balu J Published Date - 11:51 AM, Sat - 15 July 23
అద్భుతమైన నటనతో, అందంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ స్టార్ హీరో పాన్ మూవీస్ చేయకపోయినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే ప్రస్తుతం మహేశ్ చేయబోయే సినిమాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతున్నాయి. అందులో మొదటిది రాజమౌళితో తీయబోయే ప్రతిష్టాత్మక సినిమా. సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ మూవీలో మహేశ్ ఏకంగా ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ తో కలిసి పనిచేస్తున్నట్లు లేటెస్ట్ టాక్.
SS రాజుమోళి దర్శకత్వం వహించబోయే SSMB29 భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా తెరకెక్కనుంది. అంతే కాదు ఈ చిత్రంలో యాక్షన్-అడ్వెంచర్లో కీలక పాత్రలు పోషించే ముగ్గురు బాలీవుడ్ లేడీస్ ఉంటారు. ఆ భాగాల్లో ముగ్గురు బాలీవుడ్ నటీమణులను నటింపజేయాలని రాజమౌళి, ఆయన బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, వారు ఏవరు అనేది ఇంకా తెలియరాలేదే. సినిమా నిర్మాణం 2024 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుంది.
రెండు హాలీవుడ్ స్టూడియోలు కూడా ఈ యాక్షన్లో భారీగా పెట్టుబడి పెట్టడానికి చర్చలు జరుపుతున్నాయి. ఇది అన్ని దేశాలలో ఒకేసారి ఇంగ్లీష్లో విడుదలయ్యే అవకాశం ఉంది. పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ కోసం చిత్రీకరణ ప్రారంభించే ముందు మహేష్ బాబు కఠినమైన శిక్షణ తీసుకుంటారని తెలిసిందే. త్వరలో ప్రధాన తారాగణం, సిబ్బందిని ఖరారు చేయనున్నారు రాజమౌళి. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్షన్ డ్రామా గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నాడు. ఇది జనవరి 13, 2024న విడుదల కానుంది.
Also Read: Dasoju Sravan: రేవంత్ రెడ్డి మరో నయీమ్ లా మారిండు, టీపీసీసీ చీఫ్ పై దాసోజు ఫైర్!
Related News
Rajamouli : రాజమౌళిని సిరివెన్నెల అలా పిలిచేవారా.. బాహుబలి టైమ్ లో ఆయన రాజమౌళికి ఏం చెప్పారు..!
Rajamouli సిరివెన్నెల సీతారామ శాస్త్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కవనం.