పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
- Author : Vamsi Chowdary Korata
Date : 21-02-2026 - 4:29 IST
Published By : Hashtagu Telugu Desk
Gold Price పసిడి ప్రియులకు అలర్ట్. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. అయితే, వెండి రేటు మాత్రం స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, భారీ సుంకాల ప్రకటనలు బంగారం ధరలు మళ్లీ పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇలాంటి సందర్భంలో సాధారణంగానే బంగారానికి గిరాకీ పెరుగుతుంది. జువెలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే, ఇదే సమయంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతుండడం కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజుల క్రితం వరకు వరుసగా తగ్గుతూ వచ్చి ఊరట కల్పించిన పసిడి ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్ పై అమెరికా దాడి చేయవచ్చన్న అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించదన్నన వార్తలకు తోడు మళ్లీ పలు దేశాలపై సుంకాల ప్రకటనలు చేయడం బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మళ్లుతున్నారు. పసిడిపై భారీగా పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు దూసుకెళ్తున్నాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి, వెండి రేట్లు తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ 5 వేల డాలర్ల పైకి చేరాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 128 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ పసిడి ధర 5106 డాలర్లకు పైగా పలుకుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 8.92 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ఇవాళ 84.59 డాలర్లు పలుకుతోంది.
హైదరాబాద్లో బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు క్రితం రోజు తులానికి రూ.2290 మేర పెరగగా ఈరోజు మరో రూ.880 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,57,370 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు నిన్నటి రోజున తులానికి రూ.2100 మేర పెరగగా ఇవాళ మరో రూ.800 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,250 వద్దకు ఎగబాకింది.
స్థిరంగా వెండి రేటు
బంగారం ధర వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నా వెండి మాత్రం స్వల్ప ఊరట కల్పించింది. క్రితం రోజు రూ.10 వేల మేర పెరిగిన వెండి ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు వెండి రేటు ఏ మార్పు లేకుండా రూ. 2,70,000 మార్క్ వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఫిబ్రవరి 21వ తేదీ శనివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో మధ్యాహ్నానికి ధరలు మారిపోతుంటాయి. కొనుగోలు చేసే ముందే స్థానికంగా ఉండే బంగారం రేట్లు తెలుసుకోవడం మంచిది.