Richest People In India: భారతదేశంలోని టాప్ 10 సంపన్నులు వీరే.. వారి సంపాద ఎంతంటే..?
దేశంలోని ధనవంతుల జాబితాలో పెను మార్పు వచ్చింది. భారతీ ఎయిర్టెల్ షేర్లలో విపరీతమైన పెరుగుదల కారణంగా సునీల్ మిట్టల్ దేశంలోని టాప్ 10 సంపన్న భారతీయులలో చేరారు.
- By Gopichand Published Date - 12:00 PM, Sun - 21 April 24
![Richest People In India: భారతదేశంలోని టాప్ 10 సంపన్నులు వీరే.. వారి సంపాద ఎంతంటే..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/04/Safeimagekit-resized-img-2_11zon-14.png)
Richest People In India: దేశంలోని ధనవంతుల జాబితా (Richest People In India)లో పెను మార్పు వచ్చింది. భారతీ ఎయిర్టెల్ షేర్లలో విపరీతమైన పెరుగుదల కారణంగా సునీల్ మిట్టల్ దేశంలోని టాప్ 10 సంపన్న భారతీయులలో చేరారు. ఈ జాబితా నుంచి ఆయన లక్ష్మీ మిట్టల్ను మినహాయించారు. 2024 సంవత్సరం ఇప్పటివరకు సునీల్ మిట్టల్, అతని కుటుంబానికి బాగానే కలిసొచ్చింది. జనవరి 2024 నుండి అతని సంపద సుమారు $3.8 బిలియన్లు పెరిగింది. మరోవైపు ఉక్కు వ్యాపారి, ఆర్సెలార్మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ సంపద ఇదే కాలంలో దాదాపు 1 బిలియన్ డాలర్ల మేర తగ్గింది.
కేపీ సింగ్, కుమార్ మంగళం బిర్లా కూడా వెనుకబడ్డారు
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. గత ఏడాది కాలంలో భారతీ ఎయిర్టెల్ షేర్లు దాదాపు 70 శాతం పెరిగాయి. దీంతో సునీల్ మిట్టల్ నికర విలువ 19.7 బిలియన్ డాలర్లుగా మారింది. ఇప్పుడు అతను భారతదేశంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో నిలిచాడు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ ఏడాది ప్రారంభంలో సునీల్ మిట్టల్ ఈ జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు. కానీ, అతని నికర విలువ చాలా వేగంగా పెరిగింది. సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అతను DLF లిమిటెడ్ CEO KP సింగ్ను అధిగమించాడు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కూడా వెనుకబడ్డాడు.
Also Read: Health Tips : మొటిమలు, ముడతలు తగ్గించడంలో చింతపండు సహాయపడుతుందా.?
ఎయిర్టెల్ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి
భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్కు భారతీ ఎయిర్టెల్లో 28 శాతం వాటా ఉంది. ఇది కాకుండా ఇటీవల లిస్టెడ్ మొబైల్ సర్వీసెస్ ప్రొవైడర్ భారతి హెక్సాకామ్లో కూడా అతనికి 70 శాతం వాటా ఉంది. శుక్రవారం భారతి హెక్సాకామ్ విలువ సుమారు $6 బిలియన్లుగా అంచనా వేయబడింది. భారతీ ఎయిర్టెల్ విలువ 91.84 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ప్రస్తుతం దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు మాత్రమే దీని కంటే ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నాయి. శుక్రవారం ఎన్ఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేరు 1.84 శాతం పెరిగి రూ.1289 వద్ద ముగిసింది. అంతకు ముందు కంపెనీ షేర్లు కూడా 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.1296.50కి చేరాయి.
We’re now on WhatsApp : Click to Join
ఏప్రిల్ 20న భారతదేశంలోని టాప్ 10 సంపన్నులు
– ముఖేష్ అంబానీ – $112.6 బిలియన్
– గౌతమ్ అదానీ – $97.5 బిలియన్
– షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ – $37.2 బిలియన్
– శివ్ నాడార్ – $34.2 బిలియన్
– సావిత్రి జిందాల్ – $31.0 బిలియన్
– అజీమ్ ప్రేమ్ జీ – $25.3 బిలియన్
– దిలీప్ షాంఘ్వీ – $24.9 బిలియన్
– రాధాకృష్ణ దమానీ – $21.9 బిలియన్
– సైరస్ పూనావాలా – $20.2 బిలియన్
– సునీల్ మిట్టల్ – $19.7 బిలియన్
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా పేపర్ లెస్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/safeimagekit-Screenshot-2024-07-23-100222_11zon-1.png)
Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా పేపర్ లెస్..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు అంటే మంగళవారం నాడు మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు.