Rs 2000 Notes: రూ. 2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన!
రూ. 6691 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. డిసెంబర్ 31, 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 2000 నోట్లలో 98.12% బ్యాంకుకు తిరిగి వచ్చాయి.
- By Gopichand Published Date - 10:20 AM, Thu - 2 January 25

Rs 2000 Notes: తాజాగా రూ.2000 నోటుకు (Rs 2000 Notes) సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ 31, 2024 వరకు డేటాను పంచుకుంది. దీనిలో డిమోనిటైజేషన్ తర్వాత డిసెంబర్ 31, 2024 వరకు రిజర్వ్ బ్యాంక్కి ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయి? ఎన్ని నోట్లు మార్కెట్లో చలామణిలో ఉన్నాయనే విషయాన్ని ఆర్బీఐ పంచుకుంది. బ్యాంక్ డేటా ప్రకారం.. రూ. 2000 నోట్లలో 98% తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేశారు.
రూ. 6691 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. డిసెంబర్ 31, 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 2000 నోట్లలో 98.12% బ్యాంకుకు తిరిగి వచ్చాయి. మే 2023లో డీమోనిటైజేషన్ జరిగింది. ఆ సమయంలో మార్కెట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. వాటిలో రూ. 6,691 కోట్లు మాత్రమే ఇప్పుడు ఆర్బీఐకి చేరాల్సి ఉంది.
Also Read: Sydney Test: భారత్కు బ్యాడ్ న్యూస్? వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు కష్టమేనా?
19 కార్యాలయాల్లో నోట్లను డిపాజిట్ చేయవచ్చు
మీడియా నివేదికల ప్రకారం.. 2000 రూపాయల నోట్లను తిరిగి బ్యాంకులోకి మార్చుకునే లేదా డిపాజిట్ చేసే సౌకర్యం ఇప్పటికీ అందుబాటులో ఉందని రిజర్వ్ బ్యాంక్ PTIకి ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని బ్యాంకు శాఖలు 7 అక్టోబర్ 2023 నాటికి నోట్లను ఉపసంహరించుకున్నాయి. RBI 19 కార్యాలయాలలో నోట్లను తిరిగి ఇచ్చే అవకాశం ఇప్పటికీ ఉంది. రూ.2000 నోట్లు అక్టోబర్ 9, 2023 నుండి ఈ ఆర్బీఐ కార్యాలయాల్లో తిరిగి డిపాజిట్ చేయబడుతున్నాయి. ప్రజలు ఇండియా పోస్ట్ ద్వారా నోట్లను తిరిగి బ్యాంకుకు పంపవచ్చు.
ప్రజలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఓపెన్ ఆర్బిఐ కార్యాలయాలకు వెళ్లి రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు.
2000 రూపాయల నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి
మీడియా నివేదికల ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీమోనిటైజేషన్ తర్వాత రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. అయితే డీమోనిటైజేషన్ ఉన్నప్పటికీ రూ. 2000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ నోట్లు సాధారణ ప్రజల వద్ద కాకుండా.. వ్యాపారవేత్తల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. 2016లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను విడుదల చేసింది. అయితే వీటిని కూడా బ్యాంకు వెనక్కి తీసుకుంది.