Myntra Refund Scam: ప్రముఖ ఈ- కామర్స్ను మోసం చేసిన కేటుగాళ్లు.. రూ. 50 కోట్ల నష్టం!
స్కామర్లు బ్రాండెడ్ బూట్లు, దుస్తులు, ఇతర వస్తువులు వంటి అధిక-విలువ ఉత్పత్తుల కోసం పెద్దమొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత డెలివరీలో కొన్ని వస్తువులు మిస్ అయ్యాయని లేదా వస్తువులు తప్పుగా పంపబడ్డాయని స్కామర్లు ఫిర్యాదు చేసేవారు.
- Author : Gopichand
Date : 11-12-2024 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
Myntra Refund Scam: ఈ రోజుల్లో ఆన్లైన్ స్కామ్ల కేసులు ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పెరుగుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ మోసగాళ్ల నుంచి తప్పించుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఫ్యాషన్ ఈ-కామర్స్ వెబ్సైట్ Myntra కూడా వాపసు స్కామ్కు (Myntra Refund Scam) బలి అయింది. ఈ స్కామ్ కారణంగా కంపెనీ కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. కంపెనీ కస్టమర్-ఫ్రెండ్లీ రీఫండ్ పాలసీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్కామర్లు మోసానికి పాల్పడ్డారు. తాజాగా ఈ స్కాం ఆడిట్లో బయటపడింది.
స్కామ్ ఎలా జరిగింది?
సమాచారం ప్రకారం.. స్కామర్లు బ్రాండెడ్ బూట్లు, దుస్తులు, ఇతర వస్తువులు వంటి అధిక-విలువ ఉత్పత్తుల కోసం పెద్దమొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత డెలివరీలో కొన్ని వస్తువులు మిస్ అయ్యాయని లేదా వస్తువులు తప్పుగా పంపబడ్డాయని స్కామర్లు ఫిర్యాదు చేసేవారు. దీని తర్వాత Myntra రీఫండ్ పాలసీని ఉపయోగించి వారు తప్పుడు క్లెయిమ్లను సమర్పించారు. డబ్బును తిరిగి పొందడంలో విజయం సాధించారు. ఈ స్కామ్లలో డెలివరీ చేసిన ఉత్పత్తుల స్థానంలో వేరే వస్తువులు ఉండటం గమనార్హం.
Also Read: Delhi Polls 2025 : కాంగ్రెస్తో పొత్తుకు కేజ్రీవాల్ నో.. ఎందుకు ?
5,529 నకిలీ ఆర్డర్లను గుర్తించారు
సమాచారం ప్రకారం.. Myntra దేశవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని చవిచూసింది. ఇది మాత్రమే కాదు ఒక్క బెంగళూరులోనే కంపెనీ 5,529 నకిలీ ఆర్డర్లను గుర్తించింది. దీని కారణంగా కంపెనీ భారీ నష్టాలను చవిచూసింది. ఈ స్కాంలో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ ముఠా పేరు కూడా వెలుగులోకి వస్తోంది.
ఈ స్కామ్ ఎలా చేశారు?
స్కామర్లు జైపూర్ నుండి ఆర్డర్లు చేసి బెంగళూరు, ఇతర మెట్రోలలోని చిరునామాలకు డెలివరీ చేసేవారు. టీ దుకాణాలు, టైలర్ దుకాణాలు, కిరాణా లేదా స్టేషనరీ దుకాణాలు వంటి ప్రదేశాలను డెలివరీ కోసం ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఇలా చేయడం వలన కంపెనీ భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.