No Income Tax: ఐటీ శ్లాబ్ పరిమితి పెంపు.. రూ. 12 లక్షల వరకు నో ట్యాక్స్
2025 బడ్జెట్లో పేదలు, యువత, రైతులు, మహిళలపై దృష్టి సారించే 10 విస్తృత రంగాలను చేర్చినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
- Author : Gopichand
Date : 01-02-2025 - 12:24 IST
Published By : Hashtagu Telugu Desk
No Income Tax: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద ప్రకటన చేశారు. బడ్జెట్ను సమర్పిస్తూ.. వచ్చే వారం ఆదాయపు పన్నుకు సంబంధించిన కొత్త బిల్లు వస్తుందని చెప్పారు. దీంతో పాటు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ సామాన్యుల ఖర్చు సామర్థ్యాన్ని పెంచుతుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంపొందించడం, సమ్మిళిత వృద్ధిని నిర్ధారిస్తూ ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడం, దేశీయ సెంటిమెంట్ను పెంపొందించడం, పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల వ్యయ శక్తిని పెంపొందించడం బడ్జెట్ లక్ష్యమని ఆమె అన్నారు.
ఐటీ శ్లాబ్ పరిమితి పెంపు
బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ప్రకటన చేశారు. ఇప్పుడు రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను విధించబడదు. ఐటీఆర్, టీడీఎస్ పరిమితి పెరిగింది. టీడీఎస్ పరిమితి రూ.10 లక్షలకు పెరిగింది. పన్ను మినహాయింపులో వృద్ధులకు పెద్ద ప్రకటన వచ్చింది. వారు నాలుగేళ్ల పాటు రిటర్న్లు దాఖలు చేయగలుగుతారు. సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపును రెట్టింపు చేశారు. మినహాయింపును రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు.
ఉద్యోగులు ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు వచ్చింది. ఆదాయపు పన్ను శ్లాబ్ (No Income Tax) పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ. 12 లక్షల వరకు ట్యాక్స్ ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యే కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకొస్తామని తెలిపారు.
- రూ.0-4 లక్షల వరకు పన్ను లేదు
- రూ.4-8 లక్షల వరకు 5 శాతం పన్ను
- రూ.8-12 లక్షల వరకు 10 శాతం పన్ను
- 12-16 లక్షల వరకు 15 శాతం పన్ను
- 16-20 లక్షల వరకు 20 శాతం పన్ను
- 20-24 లక్షల వరకు 25 శాతం పన్ను
- రూ.24 లక్షలపైన 30 శాతం పన్ను
Also Read: Street Vendors : వీధి వ్యాపారులకు శుభవార్త.. రూ.30వేలతో యూపీఐ క్రెడిట్ కార్డులు
రైతులకు గుడ్ న్యూస్
2025 బడ్జెట్లో పేదలు, యువత, రైతులు, మహిళలపై దృష్టి సారించే 10 విస్తృత రంగాలను చేర్చినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వ్యవసాయం, MSME, పెట్టుబడులు, ఎగుమతులు వృద్ధికి ఇంజన్లు, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పరిమితిని ఆర్థిక మంత్రి 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచారు. దీంతో రైతులకు తక్కువ ధరకే రుణాలు అందుతాయి.
పన్ను రేటు ఎప్పుడు, ఎంత మారింది?
1997–98: మొదటి భారీ పెరుగుదల
1997లో అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఆదాయపు పన్ను రేట్లలో గణనీయమైన మార్పులు చేశారు. ఈ సంవత్సరం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 40% పన్ను విధించారు. ఇది ఆ సమయంలో అత్యధిక స్థాయి.
ప్రస్తుత స్థితి (2024-25)
ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. అదే సమయంలో ప్రస్తుతం రూ. 3 నుంచి 7 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను విధిస్తున్నారు. రూ.7 నుంచి 10 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.10 నుంచి 12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను విధిస్తున్నారు.