HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Diwali Muhurat Trading 2025

Muhurat Trading: ముహూరత్ ట్రేడింగ్.. ఎందుకంత ప్రత్యేకం?

మీరు కూడా స్టాక్ మార్కెట్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముహూరత్ ట్రేడింగ్ మీకు మంచి అవకాశం కావచ్చు. ఈ సమయంలో మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఉంటుంది.

  • Author : Gopichand Date : 18-09-2025 - 5:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Muhurat Trading
Muhurat Trading

Muhurat Trading: ఈ సంవత్సరం అక్టోబర్ 20న దీపావళి పండుగను జరుపుకోనున్నాం. సాధారణంగా ఈ రోజున స్టాక్ మార్కెట్ మూసి ఉంటుంది. కానీ చాలా సంవత్సరాలుగా ఒక ప్రత్యేక సంప్రదాయం కొనసాగుతోంది. అదే ముహూరత్ ట్రేడింగ్ (Muhurat Trading). సాధారణ రోజుల్లో జరిగే ట్రేడింగ్‌తో పోలిస్తే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా చాలా మంది పెట్టుబడిదారులు ఈ ట్రేడింగ్ సెషన్‌లో పాల్గొంటారు. దీపావళి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఒక ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. దీనిని ముహూరత్ ట్రేడింగ్ అని పిలుస్తారు. దీనిని భారతీయ పెట్టుబడిదారులు శుభసూచకంగా భావిస్తారు. ముహూరత్ ట్రేడింగ్‌లో చేసే పెట్టుబడులు ఏడాది పొడవునా సుఖసంతోషాలను, శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు.

ముహూరత్ ట్రేడింగ్ ఎందుకు ప్రత్యేకమైనది?

దీపావళిని కొత్త సంవత్సరానికి ప్రారంభంగా భావిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు కొత్త ఖాతాలు తెరుస్తారు లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. పెట్టుబడిదారులు లక్ష్మీదేవిని పూజించి తమ వ్యాపారాలు, పెట్టుబడులపై ఆశీర్వాదాలు కోరతారు. ఈ సంప్రదాయానికి అనుగుణంగానే స్టాక్ మార్కెట్‌లో ఈ ప్రత్యేక సెషన్‌ను ప్రారంభించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారు దీనిని శుభసూచకంగా భావిస్తారు. ఏడాది పొడవునా లాభాలు వస్తాయనే ఆశతో పాత పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో కొత్త స్టాక్‌లను జోడిస్తారు. అలాగే కొత్త పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను ప్రారంభిస్తారు.

Also Read: Airport : కొత్తగూడెం- భద్రాచలం మధ్య ఎయిర్పోర్టుకు స్థలాలు..?

ముహూరత్ ట్రేడింగ్ చరిత్ర

ముహూరత్ ట్రేడింగ్ భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత, వ్యాపార సంప్రదాయాలకు ప్రతీక. దీపావళిని కొత్త సంవత్సరానికి ప్రారంభంగా భావిస్తారు. ఈ రోజున పెట్టుబడిదారులు లక్ష్మీదేవిని పూజించి తమ వ్యాపారాలకు, పెట్టుబడులకు ఆశీర్వాదాలు కోరుకుంటారు. ఈ కారణం చేతనే ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఈ ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. ముహూరత్ ట్రేడింగ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది 1957లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో ప్రారంభమైంది. తర్వాత 1992లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కూడా దీనిని ప్రారంభించింది. ప్రస్తుతం, భారతదేశంలో చాలా మంది పెట్టుబడిదారులు ముహూరత్ ట్రేడింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు.

దీపావళి ముహూరత్ ట్రేడింగ్ 2025

భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు అయిన BSE, NSE అక్టోబర్ 21, 2025 మంగళవారం సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య ఒక గంట ప్రత్యేక ‘ముహూరత్’ ట్రేడింగ్ కోసం తెరచుకుంటాయి. బ్లాక్ డీల్ సెషన్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమై 5:40 గంటలకు ముగుస్తుంది. ప్రీ-ఓపెన్ సెషన్ సాయంత్రం 5:45 గంటలకు ప్రారంభమై 6 గంటలకు ముగుస్తుంది.

ముహూరత్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టడం సరైనదేనా?

మీరు కూడా స్టాక్ మార్కెట్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముహూరత్ ట్రేడింగ్ మీకు మంచి అవకాశం కావచ్చు. ఈ సమయంలో మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రజలు సానుకూల భావనతో స్టాక్‌లను కొనుగోలు చేస్తారు. అందుకే కొత్త పెట్టుబడులు, కొత్త ప్రారంభాలకు ఇది శుభప్రదమని భావిస్తారు. పాత పెట్టుబడిదారులు కూడా ఈ సమయంలో మంచి లాభాలు ఆశించి పెట్టుబడి పెడతారు. కొన్నిసార్లు ఈ ఒక్క గంటలో భారీ లాభాలు కూడా వస్తాయి. అందుకే పెట్టుబడిదారులకు ముహూరత్ ట్రేడింగ్ ఆకర్షణీయంగా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • Diwali 2025
  • Muhurat Trading
  • Muhurat Trading 2025

Related News

Silver runs surpassing gold.. Center exercises on hallmarking

బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు

పెట్టుబడుల కోసం, ఆభరణాల వినియోగం కోసం వెండిపై ప్రజల ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో మోసాల ముప్పు కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాల రక్షణ కోసం వెండికీ బంగారం తరహాలోనే తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభించింది.

  • Budget 2026

    కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?

  • E-passport

    భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

  • Aadhaar Updates

    ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

  • Bondada Engineering Wins ₹627 Cr APTRANSCO BESS Order

    బొండాడ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది..!

Latest News

  • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

  • టైఫాయిడ్ జ్వ‌రం ఇంకా భ‌యంక‌రంగా మార‌నుందా?

  • వీపీఎన్ సేవ‌ల‌పై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం నిషేధం!

  • పొదుపు సంఘాల వారికీ చంద్రబాబు తీపికబురు

  • లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

Trending News

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

    • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd