HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Centre Notifies Unified Pension Scheme For Employees

Unified Pension Scheme: బడ్జెట్‌కు ముందే కీల‌క నిర్ణయం.. ఏప్రిల్ 1 నుండి UPS అమలు!

ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

  • Author : Gopichand Date : 26-01-2025 - 1:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pensioners
Pensioners

Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (Unified Pension Scheme)ను నోటిఫై చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) ఆప్షన్‌గా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. యూపీఎస్‌ను ప్రభుత్వం నోటిఫై చేసింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కవర్ చేయబడిన, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఈ ఎంపికను ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు UPS వర్తిస్తుంది.

దేశ సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి 1, 2025న రాబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. UPS గ‌తేడాది ఆగస్ట్‌లో ప్రారంభించారు. ఇది పాత పెన్షన్ స్కీమ్ (OPS), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన పెన్షన్‌ను అందిస్తుంది. ఇది వారి ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది.

Also Read: Maha Kumbh Mela 205: మహాకుంభ మేళాలో స్వచ్ఛమైన గాలికోసం జపనీస్‌ పద్ధతి..

ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది

ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. పాత పెన్షన్ స్కీమ్ (OPS), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) మధ్య సమతుల్యతను సాధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టు 2024లో UPSని ప్రారంభించిందని అందులో పేర్కొంది.

ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు?

UPS కింద కొన్ని ప్రధాన ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు వారి సగటు మూల వేతనంలో 50 శాతం భరోసా పెన్షన్ పొందుతారు. 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు దామాషా పింఛను అందించే నిబంధన ఉంది. ఇది కాకుండా ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాల సర్వీసును పూర్తి చేస్తే నెలకు రూ.10,000 పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది.

UPS కింద ద్రవ్యోల్బణం ఉపశమనం కూడా ఇవ్వ‌నున్నారు. ఇది కాకుండా ఉద్యోగులు మరణించిన తర్వాత వారి కుటుంబాలకు 60 శాతం కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనం కూడా ఇవ్వనున్నారు. అలాగే పదవీ విరమణ సమయంలో మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Budget 2025
  • business news
  • central govt
  • employees
  • Modi Govt Unified Pension Scheme
  • pm modi
  • Unified Pension Scheme
  • UPS

Related News

Silver runs surpassing gold.. Center exercises on hallmarking

బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు

పెట్టుబడుల కోసం, ఆభరణాల వినియోగం కోసం వెండిపై ప్రజల ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో మోసాల ముప్పు కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాల రక్షణ కోసం వెండికీ బంగారం తరహాలోనే తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభించింది.

  • Budget 2026

    కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?

  • E-passport

    భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

  • Congress Leader

    ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయ‌కుడు సంచలన వ్యాఖ్యలు!

  • Aadhaar Updates

    ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

Latest News

  • వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

  • మలబద్దకానికి సహజ పరిష్కారం: ఎండుద్రాక్ష–పెరుగు కలయికతో పొట్టకు ఉపశమనం

  • ధనుర్మాసంలో ఏ ఆలయాలకు వెళ్లాలో తెలుసా?

  • భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసా?

  • ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

    • రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd