Ola electric scooter: ఇకపై రెంట్ కి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఎప్పటి నుంచి తెలుసా?
ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఓలా వాహన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసి
- By Nakshatra Published Date - 08:00 PM, Mon - 1 January 24
ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఓలా వాహన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓలా సంస్థ కేవలం ఎలక్ట్రిక్ వినియోగదారులకు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్న వారికి కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అదేమిటంటే రెంటల్ సర్వీస్ తో త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
పర్యాటక ప్రాంతాల్లో ఓలా ఎస్1 ప్రాడక్ట్స్ రెంటల్ సర్వీస్ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నాము. దీనిపైన మీ స్పందనేంటి? ఏవైనా సూచలు ఇస్తారా? దేశంలోని ఏ ప్రాంతాల్లో ఈ సేవలు వినియోగించుకోవాలని మీరు అనుకుంటున్నారు?అని ట్వీట్ చేశారు భవిష్ అగర్వాల్. అంతే కాకుండా బెస్ట్ కామెంట్, సూచన చేసిన ఒకరికి ఓల్ ఎస్ఎక్స్+ ఇస్తామని ని కూడా ట్వీట్ లో పేర్కొన్నారు భవిష్ అగర్వాల్. కాగా ఆయన చేసిన ట్వీట్ ని బత్తి చూస్తుంటే ఈ ఓలా ఎలక్ట్రిక్ రెంటల్ సర్వీస్ ఐడియా ప్రస్తుతం ఎర్లీ స్టేజ్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ ఐడియా కార్యరూపం దాల్చితే మాత్రం చాలా ప్రయోజనాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల యాక్సెసబులిటీ, అఫార్డెబులిటీ పెరుగుతుందని అంటున్నాయి. ఇండియాలో ఈ తరహా రెంటల్ బిజినెస్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 2 వీలర్ రెంటల్ బిజినెస్లోకి 2023లో ఎంట్రీ ఇచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ. 25 నగరాల్లో ఈ సేవలను తీసుకొచ్చింది. 300 కుపైగా బైక్స్ని అందుబాటులో ఉంచింది. ఇందుకోసం 40 కిపైగా మోటర్ సైకిల్ రెంటల్ ఆపరేటర్స్తో డీల్ కుదుర్చుకుంది. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ రెంటల్ సర్వీస్ బిజినెస్ నుంచి ఓలా ఎలక్ట్రిక్ నేర్చుకునేందుకు అవకాశం ఉంది.
ఫ్లెక్సిబులిటీ, ఛార్జీలు వంటి వాటిపై ఒక క్లారిటీ రావొచ్చు. ఒకవేళ ఈ రెంటల్ ఐడియా అమల్లోకి వస్తే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న తమ మొబైల్ యాప్లో ఈ సేవలను కూడా పొందుపరిచే యోచనలో ఓలా ఎలక్ట్రిక్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి రెంటల్ సర్వీసులు ఊపందుకున్నాయి. చాలా మంది సొంతంగా ఒక బైక్స్, స్కూటర్ని తీసుకుని టూర్ని ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. గోవా, మనాలీ, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో మంచి బిజినెస్ జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ 2024 తొలినాళ్లల్లో ఓలా ఎలక్ట్రిక్ నుంచి రెంటల్ సేవలు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Related News
Lok Sabha Polls 2024: లోక్సభ ఎన్నికల వేళ హెలికాప్టర్లకు భారీగా డిమాండ్
లోక్సభ ఎన్నికల మొదటి దశ ఇప్పటికే పూర్తి కావడంతో, మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో దాదాపు 80 శాతం ఉన్న మిగిలిన ఆరు దశలపై దృష్టి సారించింది. దీనికి ముందు రాజకీయ పార్టీలు ఛార్టర్ విమానాలు, హెలికాప్టర్లను కీలక సాధనాలుగా చేసుకుని ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.