Car Insurance: కార్ల బీమా కంపెనీలకు కొత్త తలనొప్పి.. వాహనాలకు నష్టం కలిగిస్తున్న ఏనుగులు, పక్షులు..!
దేశవ్యాప్తంగా కార్ల బీమా కంపెనీల (Car Insurance) తలనొప్పి పెరిగిపోయింది. వాహనాలకు నష్టం కలిగించే జంతువుల కేసులు 2023 సంవత్సరంలో పెరిగాయి.
- By Gopichand Published Date - 01:55 PM, Thu - 18 January 24
Car Insurance: దేశవ్యాప్తంగా కార్ల బీమా కంపెనీల (Car Insurance) తలనొప్పి పెరిగిపోయింది. వాహనాలకు నష్టం కలిగించే జంతువుల కేసులు 2023 సంవత్సరంలో పెరిగాయి. అంతే కాకుండా కారుపై కొబ్బరికాయ పడిపోవడం లేదా సహజంగా నష్టం వాటిల్లిన కేసులు కూడా పెరుగుతున్నాయి. సమాచారం ప్రకారం 2023 సంవత్సరంలో బీమా సంస్థ గో డిజిట్ తనకు వచ్చిన మొత్తం కార్ క్లెయిమ్ కేసులలో ఇటువంటి 20 కేసులలో కారు యజమానులకు చెల్లించింది. ఇందులో కోపంగా ఉన్న ఓ ఏనుగు కారును పాడు చేసింది.
వీధికుక్కల వల్ల 110 కేసులు నమోదయ్యాయి
ఏనుగుల గుంపు కదులుతున్న రోడ్డులో కారును ఆపి పాడుచేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ ఘటనలతో కార్ల బీమా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. 2023 సంవత్సరంలో ఒక్క లక్నోలోని ఇందిరా నగర్లో వీధికుక్కల వల్ల కార్లకు నష్టం వాటిల్లిన మొత్తం 110 కేసులు నమోదయ్యాయి. దీంతో బీమా కంపెనీలు క్లెయిమ్లు చెల్లించాల్సి వచ్చింది.
Also Read: Bandi Sanjay: సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలి, రేవంత్ కు బండి రిక్వెస్ట్
నెమలి, పక్షి కారును ధ్వంసం చేశాయి
గత ఏడాది కారుపై కొబ్బరికాయ పడటం, చెట్టుపై నుంచి పక్షులు కొన్ని ఆహార పదార్థాలను పడేయడం వంటి కేసులు కారు బీమా కంపెనీలకు చేరినట్లు సమాచారం. ఇది కాకుండా కోపంతో ఉన్న నెమళ్లు, ఏనుగులు, వీధి కుక్కలు కూడా కారు పైకప్పు లేదా ఇతర వస్తువులను దెబ్బతీశాయి. ఇదొక్కటే కాదు పక్షులు తమ ముక్కుతో కారు అద్దాన్ని పదే పదే కొట్టిన కేసులు బీమా కంపెనీకి క్లెయిమ్ల కోసం చేరుతున్నాయి. ఈ విషయాలన్నీ ఈ కంపెనీకి కొత్తవి. దీంతో ఈ కేసుల్లో క్లెయిమ్ల పరిష్కారంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జంతువులు, సహజ కారణాల వల్ల వాహనాలకు నష్టం వాటిల్లినందుకు కంపెనీలు ఇప్పుడు ప్రత్యేక నిపుణులైన సిబ్బందిని, న్యాయ నిపుణులను నియమించుకోవడం ప్రారంభించాయి. బీమా సంస్థల ప్రకారం.. కారుపై కొబ్బరికాయ పడి లేదా ఏనుగులు దెబ్బతిన్న కేసులు అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
Related News
New Maruti Suzuki Swift: లీటర్ పెట్రోల్తో 40 కిలోమీటర్లు.. మే 9న మార్కెట్లోకి, బుకింగ్స్ ప్రారంభం
ఈ హ్యాచ్బ్యాక్ను కంపెనీ అధికారిక వెబ్సైట్లో లేదా అరేనా డీలర్షిప్ నుండి రూ. 11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.