HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ys Jagan Visits Sringeri Sharada Peetham And Spends An Hour There

YS Jagan: శృంగేరి శారదా పీఠాన్నీ సందర్శించిన వైఎస్‌ జగన్‌.. గంటసేపు అక్కడే?

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులోని శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించారు. మంగళవారం ఆయన శ్రీవిధుశేఖర భారతి మహాస్వామిని కలసి ఆశీర్వచనం పొందారు. సుమారు గంటపాటు స్వామిజితో చర్చలు జరిపారు.

  • By Kode Mohan Sai Published Date - 05:14 PM, Wed - 20 November 24
  • daily-hunt
Ys Jagan Visits Sri Sringeri Sharada Peetham
Ys Jagan Visits Sri Sringeri Sharada Peetham

విజయవాడలోని శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సందర్శించారు. పీఠంలోని శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలిశారు. స్వామీజీ నుంచి ఆశీర్వాదం తీసుకున్న జగన్ దాదాపు ఒక గంటపాటు అక్కడ గడిపారు. ఈ సమయంలో స్వామీజీతో వారు చర్చించిన విషయాలను మాత్రం ఎక్కడ చెప్పలేదు. సమావేశం అనంతరం జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. జగన్ రాకతో స్థానిక కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు.

వైఎస్ జగన్ శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి, స్వామీజీ శ్రీ విధుశేఖర భారతీని కలవడం తాజాగా ఆసక్తి రేపింది. ఆయన అక్కడ దాదాపు ఒక గంటసేపు గడిపారు, దీంతో పీఠంలో జరిగిన చర్చలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అయితే, వైఎస్సార్‌సీపీ వర్గాలు ఈ సందర్శనను కేవలం స్వామీజీ ఆశీస్సులు తీసుకోవడం కోసమే వెళ్లినట్లుగా పేర్కొంటున్నాయి, ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడలేదు అని తెలిపారు.

వైఎస్ జగన్ గడచిన కాలంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఉండగా ఎక్కువగా విశాఖపట్నంలో ఉన్న శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి, పీఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ ఈ పీఠాన్ని సందర్శించలేదు.

ఇదిలా ఉంటే, వైఎస్ జగన్ శారదా పీఠానికి చేరుకోబోతుండగా, కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారిలో కొన్ని కుటుంబాలు ఓ మృతదేహంతో హల్చల్ చేసి, తాము ఎదుర్కొన్న ఆవేదనను వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా విజయవాడకు చెందిన నక్కా వెంకట శివనాగేశ్వరరావు అనే వ్యక్తి రోడ్డుప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. అయితే, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారని బాధితులు ఆరోపించారు.

ఈ విషయంలో కుటుంబీకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని, మృతదేహాన్ని శారదా పీఠం దగ్గరకు తీసుకువచ్చారు. పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • sri sringeri sharada peetham
  • ys jagan
  • ysrcp

Related News

If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

అసెంబ్లీ నిబంధనల ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. ఇది సరళమైన నిబంధన దాన్ని విస్మరించలేం అని ఆయన గుర్తు చేశారు.

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Kuppam

    Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్‌!

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd