HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ycp Tweet On Rushikonda Palace

Rushikonda : రుషికొండ ఫై ఉన్నవి ప్రభుత్వ భవనాలే – వైసీపీ ట్వీట్

రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు

  • By Sudheer Published Date - 09:05 PM, Sun - 16 June 24
  • daily-hunt
Ycp Counter Tdp Rushikonda
Ycp Counter Tdp Rushikonda

రుషికొండ (Rushikonda )లో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. కేవలం ఆయన మాత్రమే కాదు మీడియా ను సైతం లోనికి తీసుకెళ్లి అక్కడ ఏంజరిగింది..? జగన్ ఎలా నిర్మించారు..? లోపల ఏమేమి ఉన్నాయి..? వంటివి బయటపెట్టారు. వాటిని చూసి లోపలి వెళ్ళినవారు కాదు మీడియాలో వాటిని చూసిన ప్రజలు సైతం ఆశ్చర్యం , షాక్ కు గురయ్యారు.

ఒకప్పుడు రాజులు నిర్మించుకునే ప్యాలెస్‌కు ఏ మాత్రం తీసిపోకుండా భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఎంత గొప్పగా రుషికొండ ఫై జగన్ ప్యాలెస్‌ నిర్మించారు. దాదాపు 500 కోట్ల రూపాయలతో భవనాల నిర్మాణం జరిగింది. కేవలం బాత్ టబ్ కే రూ. 26 లక్షలు ఖర్చు చేసారని..ప్రజల సొమ్మును వీరు ఎంతలా వాడుకున్నారో చూడండి అంటూ టీడీపీ ఆరోపించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ..” పచ్చటి రుషికొండకు బోడిగుండు కొట్టారని .. అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారని, లాభాల్లోని టూరిజం భవనాలను కూల్చి రాజ భవనాలు నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సద్దాం హుసేన్, గాలి జనార్దన్ రెడ్డి భవనాలను మించి ప్రజా ధనంతో వీటిని కట్టారని శ్రీనివాస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 61ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారని పేర్కొన్నారు.

కాగా టీడీపీ నేతల ఆరోపణలను వైసీపీ ఖండించింది. రుషికొండ ఫై నిర్మించినవి ప్రైవేటు ఆస్తులు కాదని, ఎవరి సొంతకాదని తెలిపింది. విశాఖకు గత ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, అందుకే అలాంటి భవనాలను నిర్మించిందని, ఇక ఆ భవానాలను ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వం ఇష్టమని పేర్కొన్నారు.”అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు.’ అని వైసీపీ పార్టీ అధికారికంగా ట్వీట్ చేసింది.

రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి… https://t.co/o3m2GSOrAk

— YSR Congress Party (@YSRCParty) June 16, 2024

Read Also : Rushikonda : వామ్మో… రుషికొండ జగన్ ప్యాలెస్ లో 26 లక్షల విలువచేసే బాత్ టబ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • rushikonda palace
  • tdp
  • YCP Tweet

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd