HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Leaders Missing In Srikakulam

YCP Leaders Missing : ఎక్కడయ్యా.. శ్రీకాకుళం వైసీపీ నేతలు..?

సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం స్పీకర్‌గా పనిచేయగా, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ డిప్యూటీ సీఎంగా మూడేళ్లు కొనసాగారు. మూడేళ్ల క్రితం జరిగిన విస్తరణలో కృష్ణదాస్‌ స్థానంలో ఆయన సోదరుడు ప్రసాదరావుకు రెవెన్యూ మంత్రిగా అవకాశమిచ్చారు.

  • Author : Sudheer Date : 09-07-2024 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ycp Leaders Missing
Ycp Leaders Missing

టీడీపీ పార్టీ (TDP) కి కంచుకోట అంటే అది శ్రీకాకుళమే (Srikakulam). ఇక్కడ వార్డ్ మెంబర్ దగ్గరి నుండి ఎమ్మెల్యే వరకు అంత టీడీపీ నేతలే ఉంటారు..అంతలా అక్కడి ప్రజలు పసుపు జెండా కు పట్టం కడుతుంటారు. అలాంటి శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికలు టీడీపీ కి భారీ షాక్ ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర మొత్తం ఫ్యాన్ గాలి వీయడం తో శ్రీకాకుళం ప్రజలు సైతం వైసీపీ కి పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు ఉండగా, వాటిలో 08 స్థానాల్లో వైసీపీ (YCP) అభ్యర్థులే గెలిచారు. టీడీపీ కంచుకోటైన జిల్లాలో వైసీపీకి పట్టం కట్టడం తో ఆ నేతలకు అధిష్టానం కీలక పదవులు అప్పగించింది. స్పీకర్ పదవితోపాటు, డిప్యూటీ సీఎం, రెండు మంత్రి పదవులను ఆ జిల్లా నేతలకే ఇచ్చింది. సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం స్పీకర్‌గా పనిచేయగా, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ డిప్యూటీ సీఎంగా మూడేళ్లు కొనసాగారు. మూడేళ్ల క్రితం జరిగిన విస్తరణలో కృష్ణదాస్‌ స్థానంలో ఆయన సోదరుడు ప్రసాదరావుకు రెవెన్యూ మంత్రిగా అవకాశమిచ్చారు. ఇక పలాస మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కూడా నాలుగున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు. టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకర్గాలకు చెందిన దువ్వాడ శ్రీనివాస్‌, నర్తు రామారావుకు ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు. ఇలా కీలక పదవులు ఇవ్వడం తో ఆ నేతలంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా..అందినకాడికి దోచుకోవడం…నిత్యం జగన్ భజన చేయడం తప్ప వారి నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేల దగ్గరి వెళ్లి తన గోడును చెప్పుకున్న పట్టించుకోలేదు. కేవలం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. దీంతో ఈసారి ఆయా నేతలకు కోలుకోలేని దెబ్బ తీశారు. ఐదేళ్లు కళ్లుమూసుకుని గడిపిన ఓటర్లు..ఈసారి పోలింగ్ బూత్ లో కళ్లుతెరచి కూటమి కి జై కొట్టారు. ఇక ఫలితాలు రావడం ఆలస్యం జిలాల్లో ఒక్క వైసీపీ నేత కూడా కనిపించడం లేదు. గడిచిన ఐదేళ్లు మీడియా ముందు హడావిడి చేస్తూ..జగన్ భజన చేస్తూ..పవన్ కళ్యాణ్ ఫై , చంద్రబాబు ఫై ఇష్టారాజ్యంగా బూతులు తిన్న బూతుల నేతలు ఇప్పుడు కంటికి కూడా కనిపించడం లేదు. ఎక్కడైనా కనిపిస్తారో అని చూసిన కానీ లేకుండాపోయారు.

ఇక కూటమి సర్కార్ కూడా గడిచిన ఐదేళ్లు ఎవరైతే తమపై దాడులు చేసారో..అక్రమాలకు పాల్పడ్డారో..ప్రజల సొమ్ము కాజేసారో వారిపై నిఘా పెట్టింది. ఇప్పటికే పలువురు నేతల తాలూకా అక్రమ కట్టడాలను కూల్చడం..నోటీసులు జారీ చేయడం..పోలీస్ కేసులు పెట్టడం ఇలాంటివి చేస్తూ వస్తుంది. దీంతో మిగతా నేతల్లో భయం పట్టుకుంది. ఎక్కడ.. ఎప్పుడు.. ఎవర్ని..ఏ కేసులో అరెస్ట్ చేస్తారో అనే భయం పట్టుకుంది. అందుకే గత ఐదేళ్లలో నోరు పారేసుకున్న నేతలంతా ..ఇప్పుడు అన్ని మూసుకొని సైలెంట్ అయ్యారు. ఏమాట్లాడితే ఏ పాతకేసులు బయటకు తీస్తారో అని భయంతో సొంత పార్టీ నేతలతో , కార్యకర్తలతో కూడా కలవడం కానీ, మాట్లాడడం కానీ చేయడం లేదట. అందుకే ఆయా కార్యకర్తలు మా నేతలు కనపడడం లేదని మాట్లాడుకుంటున్నారట.

Read Also : Russian Army Shoes : రష్యా ఆర్మీ బూట్లు.. మన దేశంలోనే తయారవుతాయి తెలుసా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • srikakulam
  • tdp
  • ycp leaders

Related News

TDP

TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని స

    Latest News

    • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

    • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

    • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

    • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd