HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >We Are Making Government Schools Comparable To Private Schools Minister Lokesh

Nara Lokesh : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం: మంత్రి లోకేశ్‌

ఈ హైస్కూల్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినట్టు గుర్తుచేశారు. అలాగే మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఇక్కడే విద్యనభ్యసించిన విషయాన్ని తెలిపారు.

  • Author : Latha Suma Date : 07-07-2025 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
We are making government schools comparable to private schools: Minister Lokesh
We are making government schools comparable to private schools: Minister Lokesh

Nara Lokesh : నెల్లూరు జిల్లా కేంద్రంలో వెలసిన వీఆర్‌ హైస్కూల్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆకాంక్షించారు. రాష్ట్రానికి ఎంతో మంది ప్రముఖులను అందించిన ఈ పాఠశాలకు తగిన గుర్తింపు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ హైస్కూల్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినట్టు గుర్తుచేశారు. అలాగే మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఇక్కడే విద్యనభ్యసించిన విషయాన్ని తెలిపారు. గతంలో మూతబడిన ఈ పాఠశాల పునరుద్ధరణకు ప్రధాన కర్తగా మంత్రి నారాయణ కృషి చేసి ప్రారంభించారని లోకేశ్‌ ప్రశంసించారు. తిరిగి తెరచిన వీఆర్‌ హైస్కూల్‌ను ఇప్పుడు మోడల్‌ స్కూల్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు.

Read Also: Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ లో కూకట్‌పల్లికి స్పెషల్ క్రేజ్ ..గజం ఎంతంటే !!

నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో వీఆర్‌ మోడల్‌ హైస్కూల్‌ను మంత్రిగా నారా లోకేశ్‌ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కాంపౌండ్‌ను పరిశీలించారు. తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, సాంకేతిక పాఠన విధానాలు, లైబ్రరీలోని పుస్తకాలను పరిశీలించారు. ప్రతి తరగతి గదిలోని విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి క్రికెట్‌, వాలీబాల్‌ వంటి క్రీడల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యను ఎంచుకోవడం కంటే మంచి పని మరొకటి లేదని, ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివితే ఏమైనా సాధ్యమేనన్నారు. విద్యార్థులు సవాళ్లను స్వీకరించే తత్వాన్ని అలవరుచుకోవాలని, దాన్ని అనుభవంతో నేర్చుకోవాలన్నారు. వ్యక్తిగతంగా నిడమర్రులోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నట్టు తెలిపారు.

గత ఎన్నికల్లో ఓడిపోయాను. కానీ దాన్ని ఓటమిగా కాకుండా సవాలుగా తీసుకున్నాను. ఐదేళ్లు నిరంతరం కష్టపడి, ప్రజల సమస్యలు వినిపించుకొని, సేవ చేశాను. దాని ఫలితంగా ఈసారి భారీ మెజారిటీతో గెలిచాను. నేడు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. చాలా మంది ఈ శాఖ బరువు ఎక్కువని చెప్పారు. కానీ విద్యను పవిత్రమైన బాధ్యతగా తీసుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండాలన్నదే నా ఆశయం. ఇందుకోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. విద్యార్థులకు యూనిఫామ్స్‌, పుస్తకాలు, డిజిటల్ సదుపాయాలు కల్పిస్తూ, ప్రపంచ స్థాయిలో పోటీపడే విద్యను అందిస్తున్నాం అని లోకేశ్‌ వివరించారు. ఈ సందర్భంగా “పీ4” కార్యక్రమానికి ముందుకొచ్చిన పొంగూరు శరణి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డిలను మంత్రి ఘనంగా సత్కరించారు. వారి భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ మార్పు అనేది రాజకీయ పంథాలో కాదు, భవిష్యత్తు తరం రూపాంతరంలో ముఖ్య పాత్ర పోషించే మార్గమని మంత్రి స్పష్టం చేశారు. వీఆర్‌ హైస్కూల్‌ అభివృద్ధి అదే మార్గంలో అడుగులుగా నిలుస్తుందని అన్నారు.

Read Also: Happy Passia : ఉగ్రవాది హ్యాపీ పాసియా‌ను భారత్‌కు తరలించేందుకు రంగం సిద్ధం

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • government schools
  • Minister Lokesh
  • P4 Program
  • private schools
  • VR High School

Related News

CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

దేశంలో ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రతి సంవత్సరం వ్యాపార మరియు పారిశ్రామిక రంగంలో గౌరవనీయులైన వ్యక్తులను అవార్డులు ఇస్తుంది. ఈ ఏడాది ఆవార్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేయబడింది.

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

  • Nagababu

    Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

  • Pawan Kalyan Gift To Bcrick

    Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

Latest News

  • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

  • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

  • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd