HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Vijayawada Railway Court Dismisses 2016 Tuni Train Burning Case

Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో 2016లో జరిగిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (Ratnachal Express) రైలు దహనం కేసు (Tuni Train Burning Case)లో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును కొట్టివేస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పునిచ్చింది.

  • By Gopichand Published Date - 06:45 AM, Tue - 2 May 23
  • daily-hunt
Tuni Train Burning Case
Resizeimagesize (1280 X 720) (1)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో 2016లో జరిగిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (Ratnachal Express) రైలు దహనం కేసు (Tuni Train Burning Case)లో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును కొట్టివేస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కేసును సక్రమంగా విచారించనందుకు రైల్వేకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంత సున్నితమైన అంశాన్ని ఐదేళ్లు ఎందుకు లాగారని సూటిగా ప్రశ్నించింది.

విచారణ ప్రక్రియలో రైల్వే పోలీసులు నేరం రుజువు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విజయవాడ రైల్వే కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను రైల్వే పోలీసులు కోర్టు ముందు ఉంచలేరని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు రైల్వే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోర్టు ఆదేశించింది. అనంతరం కేసును కొట్టివేస్తూ తీర్పును తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు కులస్తులు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2016 జనవరి 31న కాపు రిజర్వేషన్ సాధన కోసం అప్పటి తూర్పుగోదావరి జిల్లా తునిలో సభ నిర్వహించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో కొందరు దుండగులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైలు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ సమయంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Also Read: Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి సందర్భంగా 44 ప్రత్యేక రైళ్లు

దీంతో రైలు దహనం కేసులో రైల్వే పోలీసులు 41 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ముద్రగడ పద్మనాభం, ఏ2గా ఆకుల రామకృష్ణ, ఏ3గా ప్రస్తుత మంత్రి దాశెట్టి రాజా, సినీ నటుడు జీవీ సహా 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 20 మంది విచారణకు హాజరుకాగా.. ఐదుగురు తమకేమీ తెలియదని వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసు శాఖ, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లో నమోదైన పలు కేసులను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. RPF కేసు పెండింగ్‌లో ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 146, 147, 153, 174 (ఎ), (సి) కింద కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన రైల్వే కోర్టు సుదీర్ఘ వాదనల అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Railway Court
  • Ratnachal Express
  • Train Burning Case
  • Tuni
  • Tuni Train Burning Case
  • vijayawada
  • Vijayawada Railway Court

Related News

Vijayawada-Bengaluru flight narrowly misses major danger

Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం

విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్‌వేపై నుంచి గాల్లోకి లేవగానే ఒక్కసారిగా ఓ పెద్ద పక్షి విమాన రెక్కను బలంగా ఢీకొంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విమానంలో సుదీర్ఘ శబ్దం వినిపించడంతో ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు.

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd