Kanaka Durga Temple : విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..
నేడు దుర్గగుడి పాలకమండలి సమావేశం నిర్వహించారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఆధ్వర్యంలో సమావేశం జరగగా పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
- By News Desk Published Date - 09:30 PM, Mon - 28 August 23
విజయవాడ(Vijayawada) కనకదుర్గ అమ్మవారి ఆలయంలో(Kanaka Durga Temple) గత కొంతకాలంగా పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వెళ్లిన భక్తులు కొన్ని విషయాలలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు దుర్గగుడి పాలకమండలి సమావేశం నిర్వహించారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఆధ్వర్యంలో సమావేశం జరగగా పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
దుర్గగుడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవే..
*శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం
*శివాలయంలో 40 లక్షల అంచనాతో నవగ్రహమండపం ఏర్పాటు
*వృద్ధులు,వికలాంగులకు బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలు ఏర్పాటు
*ఏడాడి లోపు చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం
*దూరప్రాంత భక్తుల కోసం మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
*నామమాత్రపు రుసుముతో డార్మిటరీలో బసకు ఏర్పాట్లు
*కనకదుర్గ ఫ్లై ఓవర్ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటుకు ఆమోదం
*బంగారు ఆభరణాల డోనర్స్ కు అందుబాటులో ఉండేలా మరో గోల్జ్ అప్రైజర్ ను నియమించాలని నిర్ణయం
*అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్న నూతన జంటకు మ్యారేజ్ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయం
*అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు ఆమోదం
*దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం
*అమ్మవారి సేవలను సోషల్ మీడియా,యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం చేయడం. దీనికోసం ఏపీ ఫైబర్ నెట్ కూడా అంగీకారం తెలిపింది.
*టిటిడి SVBC మాదిరిగా దుర్గగుడికి SDMBC ఛానల్ అందుబాటులోకి తీసుకురావడం
*అమ్మవారి కుంకుమ ప్రసాదం ప్రతీ భక్తుడికి ఇచ్చే కార్యక్రమాన్ని పౌర్ణమి రోజన ప్రారంభిస్తాం
*రెండు వేల మంది ఒకేసారి అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవన్ ను విస్తరించడం
*అన్నదాన భవన్ కు రాబోయే నెల రోజుల్లోనే శంకుస్థాపన చేయడం.
Also Read : Kashi Yatra: ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ.. కాశీ యాత్ర సాగుతుందిలా!
Related News
PM Modi Mega Roadshow In VJD : వైసీపీకి దడ పుట్టించిన మోడీ రోడ్ షో…
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు