HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Trs Plays Smart Meters Issue Card On Ap Cm Ys Jagan

TRS Vs Jagan : జ‌గ‌న్ పై టీఆర్ఎస్ `స్మార్ట్` ప్లే !

ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు తారుమారు కావ‌డానికి ఓట‌ర్ల మ‌న‌సును తాకే ఒక్క అంశం చాలు.

  • Author : Hashtag U Date : 01-10-2022 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR, Jagan
KCR, Jagan

ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు తారుమారు కావ‌డానికి ఓట‌ర్ల మ‌న‌సును తాకే ఒక్క అంశం చాలు. అందుకే, వ్య‌వ‌సాయ బావుల‌కు మోటార్ల అంశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ హైలెట్ చేస్తున్నారు. మోడీ స‌ర్కార్ పెట్టిన ఈ కండిష‌న్ ను ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జైకొట్టిన‌ప్ప‌టికీ తెలంగాణ స‌ర్కార్ నో చెప్పింద‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. ఉప ఎన్నిక‌ల నుంచి సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే అంశాన్ని ప్ర‌ధానంగా వినిపించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. మూడోసారి సీఎం కావ‌డానికి మోటార్ల అస్త్రాన్ని ఎంచుకున్నారు. కానీ, ఆ అస్త్రం మోడీతో పాటు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా తాకేలా కేసీఆర్ ప్ర‌యోగించ‌డం గ‌మ‌నార్హం.

శ్రీకాకుళం జిల్లాల్లో బోరు బావుల‌కు మోటార్ల‌ను ఏపీ ప్ర‌భుత్వం బిగించింది. అక్క‌డ రైతాంగం నుంచి వ‌చ్చే వ్య‌తిరేకత ఆధారంగా మిగిలిన ప్రాంతాల్లోనూ మోటార్లు పెట్టాల‌ని ప్లాన్ చేశారు. ఆ మేర‌కు స్మార్ట్ మీట‌ర్ల‌ను రెడీ చేశామ‌ని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చెబుతున్నారు. ఉచిత విద్యుత్ కు మీట‌ర్లు ఎందుక‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ తొలి నుంచి ప్ర‌శ్నిస్తోంది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ స‌ర్కార్ దూకుడుగా ముందుకెళుతూ మీట‌ర్ల‌ను ఫిక్స్ చేస్తోంది. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి హ‌రీశ్ రావు ఏపీలోని మోటార్ల గురించి మాట్లాడ‌గానే ఆ అంశం హైలెట్ కావ‌డంతో పాటు రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది.

వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి తీరుతామని విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఫ‌లితంగా క‌రెంట్ ఆదా అవుతుంద‌ని ఆయ‌న లాజిక్ చెబుతున్నారు. స‌రిగ్గా ఇదే పాయింట్ ను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి లేవ‌నెత్తుతున్నారు. మీటరు పెడితే విద్యుత్ ఆదా ఎలా అవుతుందని ప్రశ్నించారు. 18లక్షల మీటర్లకు 4,500 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో కమిషన్ కోసం మీట‌ర్ల‌ను పెడుతున్నార‌ని రాష్ట్రప్రభుత్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. 12 గంటలు కరెంటు ఇస్తామని 5 గంటలకు తగ్గించారన్నారు. విద్యుత్తు మోటర్లకు మీటర్లు నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే వెనక్కు తీసుకుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. త్వరలో మరో 77వేల కనెక్షన్ లను ఇచ్చేందుకు సిద్ధంగా ప్ర‌భుత్వం ఉంద‌ని పెద్దిరెడ్డి చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది మార్చి నాటికి వందశాతం స్మార్ట్ మీటర్లు పెట్ట‌డాన్ని ల‌క్ష్యంగా జ‌గ‌న్ స‌ర్కార్ ఉంది. విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుంద‌ని రివ‌ర్స్ యాంగిల్ చెబుతున్నారు. ఇప్పటికే 70 శాతం మంది రైతులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) కోసం ఖాతాలను తెరిచారని, స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోందని జ‌గ‌న్ స‌ర్కార్ లెక్కిస్తోంది.

తాజాగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉద్య‌మించ‌డానికి ప‌దునైన అస్త్రం దొరికిన‌ప్ప‌టికీ టీడీపీ దూకుడుగా వెళ్ల‌లేక‌పోతోంది. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వంలోని మంత్రులు మాత్రం వైసీపీని ప‌దేప‌దే టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • smart metres
  • Telangana CM KCR
  • trs party
  • YS Jagan Mohan Reddy

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd