HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tomato Price Decreases In Telugu States

Tomato : త‌గ్గుముఖం ప‌డుతున్న ట‌మాటా ధ‌ర‌లు.. ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు

టమాటా ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య ప్ర‌జ‌లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గత వారం రోజులుగా కిలో

  • Author : Prasad Date : 08-08-2023 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Benefits of Tomatoes
Subsidy Tomato Ap

టమాటా ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య ప్ర‌జ‌లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గత వారం రోజులుగా కిలో రూ.250 నుంచి రూ.300 వరకు పలికిన టమాట ధరలు ఖరీఫ్‌ పంట మార్కెట్‌లోకి రావడంతో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రకం, నాణ్యతను బట్టి కిలోకు రూ. 50 నుండి రూ. 100 వరకు ధరల్లో గణనీయమైన తగ్గుదల ఉందని వ్యాపారులు అంటున్నారు. అననుకూల వాతావరణ పరిస్థితులు, డిమాండ్‌కు త‌గ్గ స‌ర‌ఫరా లేక‌పోవ‌డంతో టమాటా ధ‌ర ఆకాశ‌నంటింది. అయితే ప్ర‌స్తుతం ఉత్ప‌త్తి ఎక్కువ‌గా ఉండ‌టంతో రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె వంటి మార్కెట్‌లకు ఖరీఫ్‌ పంట రాక సానుకూల ప్రభావం చూపిందని.. సోమవారం కిలో ధర రూ.76 నుంచి రూ.136 వరకు నమోదైందని అధికారులు తెలిపారు

కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో సహా ఇతర మార్కెట్‌లలో కూడా ధరలు గణనీయంగా తగ్గాయి. రాజమహేంద్రవరం, కొవ్వూరు మార్కెట్‌లలో గ్రేడ్‌-1 నాణ్యమైన టమోటా కిలో రూ.60 నుంచి రూ.70కి తగ్గగా ప్రస్తుతం రూ.100కు విక్రయిస్తున్నారు. కాకినాడ మార్కెట్‌లో మధ్య తరహా టమోటా కిలో రూ.50కి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో కిలో రూ.35 నుంచి రూ.40 వరకు తగ్గుతుందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు 50 మెట్రిక్‌ టన్నుల టమోటాలు దిగుమతులు కావడం వల్ల గ్రేడ్‌-1 నాణ్యమైన ఉత్పత్తులకు కిలో రూ.100 ధర స్థిరంగా ఉండేందుకు దోహదపడిందని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్ వినయ్ తెలిపారు. ప్రస్తుతం కర్నూలు రైతు బజార్‌లో టమాట కిలో రూ.50 నుంచి రూ.100 వరకు లభిస్తోంది. మిగతా చాలా కూరగాయలు ఇప్పుడు కిలో రూ.30 నుంచి రూ.60 వరకు పలుకుతున్నాయి.

విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతంలో గత వారం రూ.150 నుంచి రూ.160 ఉన్న ట‌మాటా ధ‌ర కిలో రూ.100కి పడిపోయింది. మూడు రోజుల క్రితం గోపాలపట్నం రైతు బజార్ ముందు చాలా పొడవైన క్యూ కనిపించింది. క్యూలైన్లో కొందరు మహిళలు గొడవపడడంతో స్వల్ప లాఠీచార్జి జరిగింది. అయితే టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులకు ఊరట లభించింది. విశాఖపట్నంలో 13 రైతు బజార్లు ఉన్నాయని, ప్రతిరోజూ సుమారు 30 టన్నుల టమోటాలు అమ్ముడవుతున్నాయని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యాషిన్ తెలిపారు.

విశాఖపట్నం శివార్లలోని ఆనంద పురం ప్రాంతంలో టమాటా పంటను ప్రారంభించినట్లు తెలిపారు. ఆనంద పురం నుండి టమోటాలు నగరానికి రావడం ప్రారంభించినందున ధరలు పడిపోయింద‌ని తెలిపారు. విజయవాడలో వారం రోజుల క్రితం అత్యధికంగా రూ.150 పలికిన టమాటా ధర రూ.80కి పడిపోయింది. ప్రస్తుతం అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి, బెంగళూరు నుంచి కూడా టమోటాలు తీసుకురావడంతో ధర తగ్గిందని మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో గత రెండ్రోజుల క్రితం అత్యధికంగా రూ.120 పలికిన టమాటా ధర రూ.80కి పడిపోయింది. రైతులు పొలాల నుంచి కొత్త నిల్వలను మార్కెట్‌కు తీసుకురావడంతో ఇతర కూరగాయల ధరలు కూడా కిలోకు ఐదు నుంచి ఎనిమిది రూపాయలు స్వల్పంగా తగ్గుతున్నాయి. కిలో రూ.100 పలికిన పచ్చిమిర్చి ఇప్పుడు రూ.80కి విక్రయించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • tomato
  • tomato price
  • Visakhapatnam

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd