HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >These Are The Decisions Taken In The Meeting Of Cms Of Telugu States

Meeting Of CMs: ముగిసిన‌ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు ఇవే..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు (Meeting Of CMs) ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు.

  • Author : Gopichand Date : 07-07-2024 - 12:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Meeting Of CMs
Meeting Of CMs

Meeting Of CMs: తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు (Meeting Of CMs) ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు. ఈ సమాశానికి సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భ‌ట్టి హాజ‌రుకాగా.. ఏపీ మంత్రులు కందుల దుర్గేష్‌, స‌త్య‌ప్ర‌సాద్‌, బీసీ జ‌నార్ద‌న్ కూడా హాజ‌ర‌య్యారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో విభజన అంశాలపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్.. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ శనివారం జ‌రిగిన‌ సమావేశం నిర్ణయాలను ఉమ్మడిగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు అయిన మేము లోతుగా చర్చించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన చర్చించుకోవాలని, పరిష్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని డిప్యూటీ సీఎం భ‌ట్టి తెలిపారు.

Also Read: Prajabhavan : ముగిసిన బాబు – రేవంత్ ల సమావేశం..ఫైనల్ గా డిసైడ్ చేసింది ఇదే..

ఒక్క సమావేశంలోనే పరిష్కారం వస్తుందని మేము అనుకోవ‌టంలేదు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎస్ లతో పాటు ముగ్గురు అధికారులతో కమిటీ ఉంటుంది. రెండు వారాల్లో సమావేశం కావాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ అధికారుల కమిటీలో పరిష్కారం కానీ అంశాల కోసం మంత్రుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కూడా వీలుకాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించడం జరుగుతుంది. మంత్రుల స్థాయిలో కూడా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుంటే ముఖ్య‌మంత్రులు మ‌రోసారి భేటీ అవుతారు. అదేవిధంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ క్రైమ్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈమేరకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించిన‌ట్లు భ‌ట్టి తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఈరోజు తెలుగు జాతి హర్షించే రోజు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చంద్రబాబు లేఖ పంపించారు. ఈరోజు జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి సలహాలు తీసుకుని కూలంకషంగా చర్చించాం. పెద్ద ఎత్తున ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడింది. అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ సమావేశమై చర్చించాలని ఇద్దరు సీఎంలు చెప్పారు. ఏపీలో ఇప్పటికే డ్రగ్స్ పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. డ్రగ్స్ మహమ్మారి సమస్యలను ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని ఆయ‌న తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • cm revanth
  • CMs Meeting
  • hyderabad
  • Prajabhavan
  • telugu states

Related News

New Liquor Brands

మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

ప్రపంచంలో కొన్ని వేల రకాల మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. కానీ మందుబాబులు ఎక్కువగా తాగేది బీరే. కొంతమంది కొత్త వరైటీలు టేస్ట్ చూస్తారు. తెలంగాణలో మద్యం ప్రియులు ఈమధ్య బాగా యాక్టివ్ అయ్యారు. వారు రొటీన్ సరుకు వద్దంటున్నారు. కొత్త బ్రాండ్లు, విదేశీ బ్రాండ్లు కావాలంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. వారి కోరిక తీర్చేందుకు.. తెలంగాణలో కొత్త బ్రాండ్లను రానివ్వాలని డిసైడ్ అ

  • Fire Incident In Maitrivana

    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్

  • Jagan App

    AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Indiramma Housing Scheme 2n

    హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

Latest News

  • భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

  • సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్య‌కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

  • రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ వచ్చేసిన‌ట్లే!

  • శివుడికి ప్రార్థనలు చేసిన పులి.. వీడియో వైర‌ల్‌!

Trending News

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd