Firing In Palnadu: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా (Palnadu) రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు (Firing) చోటుచేసుకున్నాయి.
- By Gopichand Published Date - 07:53 AM, Thu - 2 February 23
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా (Palnadu) రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు (Firing)చోటుచేసుకున్నాయి. ఈ ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కలకలం సృష్టించింది. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి పారిపోయారు. ప్రత్యర్థులు ఆయన మీద రెండు రౌండ్ల కాల్పులు చేశారు. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డి, కుటుంబ సభ్యులు గాయపడ్డారు.
Also Read: Delhi Mayor Election: ముచ్చటగా మూడోసారి.. ఈనెల 6న ఢిల్లీ మేయర్ ఎన్నిక
వీరికి చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది