TDP : బీసీలు ఈ రాష్ట్రంలో బతకొద్దా.. ? వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ బీసీ నేతల ఆగ్రహం
పుంగనూరులో దాడికి గురైన బీసీ నేతలకు కొల్లు రవీంద్ర, వీరంకి వెంకట గురుమూర్తి భరోసానిచ్చారు. దాడులు చేసి, దౌర్జన్యాలకు
- By Prasad Published Date - 07:14 AM, Fri - 27 October 23
పుంగనూరులో దాడికి గురైన బీసీ నేతలకు కొల్లు రవీంద్ర, వీరంకి వెంకట గురుమూర్తి భరోసానిచ్చారు. దాడులు చేసి, దౌర్జన్యాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి హెచ్చరించారు. చంద్రబాబుకు మద్దతుగా సైకిల్ ర్యాలీ చేపట్టిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నేతలపై పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దాడికి గురైన తెలుగుదేశం పార్టీ బీసీ నేతలను కేంద్ర కార్యాలయంలో కలిసి పరామర్శించారు. 70లక్షల మంది కార్యకర్తలు వారికి అండగా ఉంటారన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటమని.. వారి అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైందని అన్నారు. అటువంటి బీసీలకు తెలుగుదేశం పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధైర్యపడొద్దని, దాడి చేసి మన గొంతు నొక్కాలని ప్రయత్నించే వారి నియంతృత్వాన్ని సమాధి చేసే వరకు పోరాటం వీడొడ్డని సూచించారు.
Also Read: TDP : నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.? – నారా భువనేశ్వరి
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది