HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Bhuvaneswari Fires On Cm Jagan

TDP : నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.? – నారా భువ‌నేశ్వ‌రి

వైసీపీ పాల‌న‌లో నాలుగ‌న్న‌రేళ్ల‌లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా అని నారా భువనేశ్వరి

  • Author : Prasad Date : 27-10-2023 - 7:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

వైసీపీ పాల‌న‌లో నాలుగ‌న్న‌రేళ్ల‌లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా అని నారా భువనేశ్వరి ప్రశ్నించారు. వేధించడం, ఇబ్బందులు పెట్టడం గొప్ప అనుకుంటున్నారని ఆమె ప్ర‌భుత్వంపై మండిపడ్డారు. నిరాహార దీక్షలు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు కాదు.. ఎండుతున్న పోలాలకు నీళ్లివ్వండిని సూచించారు. ప్రభుత్వ దృష్టి చంద్రబాబు రాసిన లేఖపై కాదని, అభివృద్ధిపై పెట్టాలన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా భువనేశ్వరి ప్రసంగించారు. ‘‘మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగినా మా మనసులోకి వచ్చేది వెంకటేశ్వరస్తామి. ఎప్పుడు వెళ్లినా కుటుంబ సమేతంగా వెళ్లేదాన్ని..కానీ మొన్న ఒక్కదాన్నే వెళ్లాను. చంద్రబాబు అరెస్టుతో నలుగురం నాలుగు దిక్కులయ్యామంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయిందని.. మనవడు దేవాన్ష్ ను చూడక 48 రోజులు అయిందన్నారు. తిరుపతిని ఎన్టీఆర్ ఎలా అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుస‌ని.. తి రుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో నిత్యాన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని భువ‌నేశ్వ‌రి గుర్తు చేశారు. తర్వాత చంద్రబాబునాయుడు కూడా తిరుపతిని అభివృద్ధి చేశారని.. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా చంద్రబాబు అభివృద్ది చేశారని ఆమె తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

భక్తి కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తే ప్రశాంతతో ఉంటారని అభివృద్ది చేశారు. దేవాలయాలకు వచ్చే ఆదాయంతో పుణ్యక్షేత్రాలు మరింత అభివృద్ధి చేయవచ్చన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారని తెలిపారు. అనంతపురం జిల్లాను ఆటోమెబైల్ హబ్ గా.. చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. గతంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్లో ఇప్పుడు ఒకటి రెండు తప్ప అన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయన్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని.. మన రాష్ట్ర యువతకు రావాల్సిన ఉద్యోగాలున్నీ పక్క రాష్ట్రాల యువతకు పోతున్నాయన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ ఈ జిల్లాలో 30 ఏళ్లుగా ఉందని.. వాళ్లనూ ఇబ్బందులు పెట్టారన్నారు. ఏపీ నుంచి వెళ్లిన‌ రూ.9,300 కోట్ల పెట్టుబడిని అమ‌ర్‌రాజా కంపెనీ తెలంగాణలో పెట్టింద‌ని గుర్తు చేశారు.తాను కూడా హెరిటేజ్ నడిపిస్తున్నాని.. ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో హెరిటేజ్ ఉందన్నారు. మమ్మల్ని వాళ్లు ఆహ్వానించి పరిశ్రమకు ఏం కావాలో అడుగుతారని.. అన్నీ ఇచ్చి పెట్టుబడుల్లో ముందుకు తీసుకెళ్తారన్నారు. ఏనాడూ మమ్మల్ని భయపెట్టలేదు. చంద్రబాబు ఉమ్మడి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ కు ఐఎస్బీ తీసుకొచ్చారని గుర్తు చేశారు.

Also Read:  Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్.. నా భ‌ర్త లేకుండా తొలిసారి..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • nara bhuvaneshwari
  • nara chadnrababu naidu
  • Nijam Gelavali yatra
  • telugudesam party

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd