HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Supreme Decision On Village And Ward Volunteers

Supreme Decision: గ్రామ, వార్డు వాలంటీర్ల పై సుప్రీమ్ నిర్ణయం

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వ్యవహారం సుప్రీమ్ కోర్ట్ కు చేరింది. అడ్డగోలుగా వాళ్ల నియామకాలు ఉన్నాయని, ఎలా నియామకం జరిగింది? వాళ్ళు ఎవరు? విధులు, భాద్యతలు ఏమిటి? అనేదానిపై సీరియస్ చర్చ జరిగింది.

  • Author : CS Rao Date : 11-04-2023 - 4:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Decision On Village And Ward Volunteers
Supreme Decision On Village And Ward Volunteers

Supreme Court Decision on Village, Ward Volunteers : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వ్యవహారం సుప్రీమ్ కోర్ట్ (Supreme Court) కు చేరింది. అడ్డగోలుగా వాళ్ల నియామకాలు ఉన్నాయని, ఎలా నియామకం జరిగింది? వాళ్ళు ఎవరు? విధులు, భాద్యతలు ఏమిటి? అనేదానిపై సీరియస్ చర్చ జరిగింది. ఏపీలో ఉన్న 2.56 లక్షల మంది వలంటీర్లు 1.45 లక్షల మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు విస్తృత సర్క్యులేషన్ ఉన్న పత్రిక కొనుగోలు చేయడానికి రూ.200 చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రెండు వేర్వేరు జీవోలు విడుదల చేసింది. ఈ రెండింటిని సవాల్ చేస్తూ ‘ఈనాడు’ ప్రచురణకర్త అయిన ఉషోదయ పబ్లికేషన్స్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ జీవోల్లో ‘సాక్షి’ పత్రిక అనే పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా ముఖ్యమంత్రి ఇతర మంత్రులు పార్టీ కార్యకర్తలు ‘ఈనాడు’ను ఎల్లో మీడియాగా విమర్శిస్తూ దాన్ని చదవొద్దని ప్రచారం చేస్తున్నారని ఉషోదయ కోర్టు దృష్టికి తెచ్చింది. తద్వారా వలంటీర్లు సచివాలయ ఉద్యోగులంతా సాక్షినే కొనుగోలు చేయాలని పరోక్షంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఆక్షేపించింది. ఆ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ‘ఈనాడు’ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 10న విచారణ జరిగింది. ఈ కేసును ఏపీ హైకోర్టులో చేపట్టిన తీరు చాలా ఆందోళనకరంగా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ రిట్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్కు బదిలీ చేస్తామని దానిపై వారే విచారణ చేపడతారని పేర్కొంది.ఈ నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం తరుఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు ఏపీ హైకోర్టులో ఏప్రిల్ 21న విచారణకు రానున్న తరుణంలో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తే అనవసరంగా జాప్యం జరుగుతుందన్నారు.

ముకుల్ రోహత్గీ బదులిస్తూ ఉషోదయ సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను పాత పిల్తో కలిసి విచారించడానికి వీల్లేదని అందువల్ల దాన్ని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయడమే సమంజసమని వాదించారు. అవసరమైతే జీఓలు తదుపరి పరిణామాలపై స్టే ఇస్తామని పేర్కొంటూ ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.

వార్డు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు… సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా ఒక్కొక్కరికి నెలకు రూ.200 చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులో ఉషోదయ వేసిన రిట్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తామని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ జస్టిస్ పీఎస్ నరసింహ జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

ఎవరు వారి నియామకం ఎలా జరుగుతుందని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రతివాది ‘ఈనాడు’ పత్రిక తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ దేవదత్ కామత్ న్యాయవాది మయాంక్ జైన్ సమాధానం ఇస్తూ వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలని తెలిపారు. రాజకీయ ఎజెండాతోనే వారంతా పనిచేస్తున్నారని చెప్పారు. తదుపరి విచారణ ఆసక్తిగా మారింది.

Also Read:  YCP vs TDP: వైసీపీ కి పోటీగా టీడీపీ ప్రోగ్రామ్ ‘ సైకో పోవాలి – సైకిల్ రావాలి’


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • decision
  • Supreme Court
  • village
  • Ward Volunteers

Related News

DRDO Aircraft Manufacturing Center in Andhra Pradesh

DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ భారీ ప్రాజెక్ట్

ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస

  • Andhra Pradesh

    ఏపీకి మరో భారీ పరిశ్రమ

  • Chandrababu Naidu

    TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

Latest News

  • Pawan : హీరో నానికి..ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్

  • IND VS PAK: షేక్‌హ్యాండ్ ఇస్తార‌ని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం: స‌ల్మాన్ ఆఘా

  • Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

  • IPL: చెన్నై vs ముంబై.. ధోని, రోహిత్ రీఎంట్రీ ఇస్తారా..?

  • Highest Liquor Sales: రికార్డ్ సృష్టించిన మందుబాబులు

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd