HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Strong Ai System In The State Cm Chandrababu

CM Chandrababu : రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ : సీఎం చంద్రబాబు

ఎన్విడియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, పరిశోధన, స్టార్టప్‌ల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 10 వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Author : Latha Suma Date : 07-06-2025 - 12:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sachivalayam Employees
Sachivalayam Employees

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక సాంకేతికతకు పునాది వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా బలమైన కృత్రిమ మేధస్సు (ఏఐ) వ్యవస్థ నిర్మాణానికి ఎన్విడియా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో ప్రకటించారు. చంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఈ ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఎన్విడియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, పరిశోధన, స్టార్టప్‌ల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 10 వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also: Health Tips: కిడ్నీ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోండి ఇలా?

ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా విద్యార్థులు కేవలం సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా, గ్లోబల్‌ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా పరిశోధన, ఆవిష్కరణల్లో పాల్గొనగల సామర్థ్యం పొందుతారని తెలిపారు. ఇది రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు పెంచడంలో పెద్దపాళ్లు నిర్వహించనుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చెప్పిన ప్రధాన అంశం ఏంటంటే, ఈ ఒప్పందం ఫలితంగా రాష్ట్రం నుంచి 500 కృత్రిమ మేధస్సు ఆధారిత స్టార్టప్‌లు ప్రారంభం కావడం ఖాయం. విద్య, నైపుణ్యం నుంచి పరిశోధన, ఆవిష్కరణ వరకు ఈ సమగ్ర అభివృద్ధికి ఏపీ పునాది వేస్తోంది అని తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, పరిశోధకులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, ఏపీ ఇలా ముందడుగు వేయడం ప్రాధాన్యతగల పరిణామంగా పరిగణించవచ్చు.

ఏఐ టెక్నాలజీని ఉపాధి అవకాశాలుగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్‌ను కొత్త దారిలో నడిపించేందుకు శ్రమిస్తున్నదనడానికి ఈ ఒప్పందమే నిదర్శనం. గతంలో చంద్రబాబు మౌలిక సదుపాయాల అభివృద్ధికి, డిజిటల్ రంగానికి ప్రాధాన్యతనిచ్చిన నేతగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే దిశగా అడుగులు వేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. మొత్తంగా, ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడమే కాక, ఏఐ రంగంలో ఏపీ ఒక ప్రధాన కేంద్రంగా ఎదగడానికి ఇదొక గట్టి అడుగు అని చెప్పవచ్చు.

Read Also: Tollywood : సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 thousand engineering students
  • AI System
  • ap
  • CM Chandrababu
  • nara lokesh

Related News

Nara Lokesh Skill Census Vs

మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది

'రెడ్ బుక్లో చాలా పేజీలున్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తెలుసు. ఎవరినీ వదిలిపెట్టను' అని మంత్రి లోకేశ్ నిన్న ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

  • Lokesh Foreign Tour

    ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

  • Lokesh Family Stars

    లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

  • CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

    సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Latest News

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

  • సర్పంచ్ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ అసంతృప్తి

  • ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

  • బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి

  • గదిలో ప్రియుడితో ఏకాంతగా గడుపుతున్న యువతి, సడెన్ గా తండ్రి ఎంట్రీ

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd