street vendors scheme : కోవిడ్ స్కీమ్ లోనూ తెలుగు రాష్ట్రాల మాయ! వీథి వ్యాపారుల ఫండ్ డ్వాక్రాకు మళ్లింపు!!
తెలుగు రాష్ట్రాల్లో స్వయం సహాయక బృందాల్లోని సభ్యులను లబ్దిదారులుగా( street vendors schem) చేసినట్టు గుర్తించింది.
- By CS Rao Published Date - 05:00 PM, Mon - 12 June 23
కోవిడ్ సందర్భంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్రం ప్రవేశపెట్టిన(street vendors scheme)`పీఎం సేవానిధి`( పీఎం వీధి వ్యాపారుల ఆర్మతనిర్భర్ నిధి) నిధులను దక్షిణ భారతదేశం భారీగా వినియోగించుకుంది. ఆ విషయంలో ఏపీ టాప్ లో ఉండగా, రెండో స్థానంలో తెలంగాణ, మూడు, నాలుగు స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయని అధికారికంగా కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో స్వయం సహాయక బృందాల్లోని సభ్యులను లబ్దిదారులుగా చేసినట్టు గుర్తించింది.
తెలుగు రాష్ట్రాల్లో స్వయం సహాయక బృందాల్లోని సభ్యులను లబ్దిదారులుగా(street vendors scheme)
వీధి వ్యాపారులకు అందాల్సిన నిధులను స్వయం సహాయ బృందాలకు అందచేయడంతో మహిళలు ఎక్కువగా లబ్దిపొందినట్టు తెలుగు రాష్ట్రాల్లో తేలింది. కేంద్ర నిధులను పక్కదోవ పట్టించడంలో ముందుండే తెలుగు రాష్ట్రాల్లో వీధి వ్యాపారులకు కోవిడ్ సందర్భంగా అందాల్సిన నిధులను స్వయం సహాయ బృందాల్లోని సభ్యులకు అందచేయడం ద్వారా టాప్ లో నిలిచాయి. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 41 శాతం మంది మహిళలు లబ్ది పొందారు. జూన్ 1 నాటికి ఈ పథకం మూడు సంవత్సరాలు పూర్తయింది.
మొత్తం లబ్ధిదారుల సంఖ్య 36.33 లక్షలు ఉండగా వారిలో 21.31 లక్షల మంది పురుషులు, 15.02 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ పథకంలో “ఇతరులు” కేవలం 219 మంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. దక్షిణ, ఈశాన్య భారతంలోని 10 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో స్త్రీలే ఎక్కువ మంది లబ్ధిదారులు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్ (70 శాతం మహిళలు), తెలంగాణ (66 శాతం మహిళలు), తమిళనాడు (64 శాతం మహిళలు), కర్ణాటక (50 శాతం మహిళలు%) ఉన్నారు. కేరళ మాత్రం జూన్లో కుటుంబశ్రీ సొంత కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతను పెంపొందించడంలో అగ్రగామిగా ఉంది.
ఏపీ టాప్ లో ఉండగా, రెండో స్థానంలో తెలంగాణ
దేశంలోని మొత్తం 15,02,597 మంది మహిళా లబ్ధిదారులలో (street vendors scheme) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళా లబ్ధిదారులు 5,80,956 మంది ఉన్నారు. అంటే, దాదాపు 39 శాతం మంది ఉన్నారని అంచనా. ఇక ఈశాన్య రాష్ట్రాలలో మహిళా లబ్ధిదారులు అధిక శాతం ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల సంఖ్యలో వాటా చాలా తక్కువ. మణిపూర్ (94 శాతం), నాగాలాండ్ (88 శాతం), మేఘాలయ (77 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (75 శాతం), సిక్కిం (58 శాతం) అధిక మహిళా వాటాగా నిలుస్తున్నాయి. అస్సాంలో కూడా 47 శాతం ఉన్న మహిళల వాటా జాతీయ సగటు 41 శాతం కంటే ఎక్కువగా ఉంది. తక్కువగా 12 శాతం మహిళల వాటాతో త్రిపుర చివరి స్థానంలో నిలిచింది.
లబ్దిదారుల సంఖ్యలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా
బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా 9.60 లక్షలు మరియు 5.41 లక్షల మంది లబ్ధిదారులు (పురుషులు మరియు మహిళలు) ఉన్నారు. మహిళా లబ్ధిదారులు రెండు రాష్ట్రాలలో ఒక్కొక్కరు 32 శాతం చొప్పున ఉన్నారు. మహిళలు 4.82 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. ఇక RJD-JDU-కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీహార్లో 14,098 మంది లబ్ధిదారులు ఉండగా, మహిళా లబ్ధిదారులు 27 శాతం మంది ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో కేవలం 15,861 మంది ఉండగా 23 శాతం మంది మహిళలు ఉన్నారు. లబ్దిదారుల సంఖ్యలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉండటంలో ప్రాంతాల సామాజిక స్వరూపం పాత్ర పోషిస్తుందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉదాహరణకు, మేఘాలయలోని మాతృస్వామ్య సమాజాలలో చిన్న కుమార్తె ఆస్తిని వారసత్వంగా పొందుతుంది. మహిళలు చాలా సంస్థలను నిర్వహిస్తున్నారు.
Also Read : AP Employees : జగన్ కు పాలాభిషేకం తెచ్చిన తంటా! మంత్రి ఛాంబర్ కు ఉద్యోగుల తాళం
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా (NASVI) జాతీయ కోఆర్డినేటర్ అర్బింద్ సింగ్ మాట్లాడుతూ, ఈ పథకాన్ని లక్ష్యంగా చేసుకున్న విధానం పెద్ద పాత్ర పోషించాలని అన్నారు. “కొన్ని రాష్ట్రాల్లో, స్థానిక అధికారులు మహిళా స్వయం సహాయక బృందాలను లబ్ధిదారులుగా లక్ష్యంగా చేసుకున్నారు. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్లో, వారు MEPMA [మునిసిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్]ను కలిగి ఉన్నారు. ఇది ఇప్పటికే స్వయం సహాయక సంఘాలతో కలిసి పనిచేస్తోంది, ”అని సింగ్ చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకున్నాయని( street vendors scheme)
కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారని, ఆయా రాష్ట్రాల్లో వీధి వ్యాపారులు ఎక్కువగా ఉన్నారని అర్థం కాదని సింగ్ అన్నారు. పెద్ద సంఖ్యలో వీధి వ్యాపారుల లబ్ధిదారులను కలిగి ఉన్న పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్ . మహారాష్ట్రలో మొత్తం లబ్ధిదారులలో మహిళలు వరుసగా 42 శాతం మరియు 41 శాతం ఉన్నారు. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకున్నాయని( street vendors scheme) డేటా చెబుతోంది. అందులోనూ మహిళలు ఎక్కువగా ఉన్నారని తేలింది.
Also Read : KCR’s Coverts: బీజేపీలో కేసీఆర్ కోవర్ట్ లు..! జాబితా రెడీ..!!
Related News
Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. మామకు ఓటు వేయొద్దు అని అల్లుడు వీడియో..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది.