KCR’s Coverts: బీజేపీలో కేసీఆర్ కోవర్ట్ లు..! జాబితా రెడీ..!!
సేమ్ టూ సేమ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వేటాడిన కోవర్ట్ పాలిటిక్స్ ఇప్పుడు బీజేపీని వణికిస్తోంది. తెలంగాణ బీజేపీలోని కోవర్ట్ (KCR's Coverts)ల జాబితా బయట పెడతానంటూ పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలనం రేపారు.
- By CS Rao Published Date - 02:09 PM, Sun - 11 June 23
KCR’s Coverts: సేమ్ టూ సేమ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వేటాడిన కోవర్ట్ పాలిటిక్స్ ఇప్పుడు బీజేపీని వణికిస్తోంది. తెలంగాణ బీజేపీలోని కోవర్ట్ (KCR’s Coverts)ల జాబితా బయట పెడతానంటూ పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలనం రేపారు. అంటే ఆయన కూడా బీజేపీకి గుడ్ బై చెబుతున్నారని టాక్ మొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్కు సానుకూలంగా మారతాయని, బీజేపీ నుంచి ఆ పార్టీలోకి వలసలు ఖాయమంటూ విశ్లేషణలు వెలువడుతున్న వేళ నందీశ్వర్ గౌడ్ పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలో బీజేపీ కీలక నేతల్లో ఒకరైన పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆసక్తికరమైన పరిణామానికి దారితీశారు. భాజపాలో సీఎం కేసీఆర్ కోవర్టులున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవర్టుల పేర్లను భాజపా పెద్దలకు చెప్పానని , కోవర్టుల తీరు మారకపోతే పేర్లను మీడియాకు వెల్లడిస్తానని అన్నారు. ఆ కోవర్టులెవరో త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. మరో 15 రోజుల్లో సంచలన లిస్ట్ బయటకు వస్తుందని చెప్పడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమ రాజకీయ భవిష్యత్తుపై అటు రాష్ట్ర నేతలు.. ఇటు కేంద్ర నేతలు దృష్టి సారించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పార్టీ, టికెట్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న ఖమ్మం కీలక నేతలు పొంగులేటి, జూపల్లి కృష్ణరావులు ఏ పార్టీలో చేరాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని స్పష్టమైన సమాచారం. ఏఐసీసీ వర్గాలు కూడా అదే నిజమని నిర్థారిస్తున్నాయి.
Also Read: Chandrababu: చంద్రబాబుకు ‘సువేరా’ సంచలన రిపోర్ట్..!
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 20న లేదా 25న ఖమ్మంలో భారీ బహిరంగ సభ వేదికగా ఈ ఇద్దరూ తన అనుచరగణంతో హస్తం గూటికి చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ రానున్నట్లు తెలుస్తుంది. ఇక వీరిద్దరిని పార్టీలోకి తీసుకురావడానికి రాహుల్ గాంధీ టీం బాగా కష్టపడ్డట్లు తెలుస్తుంది. కాగా మొదట వీరు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తరువాత షర్మిల పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఉన్న పార్టీలోనే చెబుతూ వస్తున్న పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. .ఇప్పటికే భట్టి విక్రమార్క పాదయాత్ర ముగిసే అవకాశం ఉంది. ఆ సభ తర్వాత ఈ చేరికలు ఉండవచ్చు.
మరోవైపు ఈ ఇద్దరు నేతలు తమ పార్టీలో చేరే అవకాశం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పిచ్చాపాటిగా మీడియాకు చెప్పడంతో.. వీళ్లిద్దరూ కాంగ్రెస్ లోకి వెళ్లడం దాదాపు లాంఛనమే అనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా పడింది. తెలంగాణలో ఇప్పటివరకు కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి రాజకీయంగా బలపడుతున్న బీజేపీకి కర్నాటక ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరిన తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి ? కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరింతగా పెరుగుతాయా ? అన్నది ఆసక్తికరంగా మారింది. వీళ్ళతో పాటు నందీశ్వర్ గౌడ్ బయట పెట్టె కోవర్ట్ వ్యవహారం బీజేపీని ఇరకాటంలో పడేయనుంది.
Related News
Narendra Modi : పశ్చిమ బెంగాల్లో మోదీ ప్రచారం.. టిఎంసిపై సంచలన వ్యాఖ్యలు..!
ఏళ్ల తరబడి పశ్చిమ బెంగాల్ పరిస్థితిని 'దోపిడీ' చేస్తూ దిగజారిపోయాయని కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మండిపడ్డారు.