Security Arrangements: కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీరాల్లో భద్రతా ఏర్పాట్లు..!
బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. వచ్చే నెల 23న కార్తీక మాసంతో ఈ మాసం ముగుస్తుంది.
- By Gopichand Published Date - 10:45 AM, Fri - 28 October 22
బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. వచ్చే నెల 23న కార్తీక మాసంతో ఈ మాసం ముగుస్తుంది. ఈ సమయంలో భక్తులు నదీస్నానాలు చేసేందుకు మొగ్గు చూపుతారు. సముద్ర, నదీ స్నానాలు చేసి భక్తిభావంతో ఉంటారు. యాత్రలు చేసేవారు, మాల ధరించేవారు నదీ తీరాల్లో స్నానం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో కార్తీక మాసం మొత్తం భక్తభావమే నిండి ఉంటుంది. అయితే.. కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని తీర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై బాపట్ల ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని తీర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు ముందు సూర్యలంక, ఓడరేవు సముద్ర తీరాల్లో భక్తులు పుణ్యస్నానానికి వచ్చే సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పోలీసు అధికారులతో చర్చించారు. బీచ్లను 50 మీటర్ల సెక్టార్లుగా విభజించాలని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వీటిని పోలీసు సిబ్బంది తాళ్లు ఉపయోగించి, లైఫ్ జాకెట్లు ధరించి పర్యవేక్షిస్తారు. శిక్షణ పొందిన ఈతగాళ్ల అందుబాటులో ఉంటారు. ప్రజలు ముప్పును సూచించే విధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సూచనలు ఇవ్వాలని జిందాల్ సూచించారు. నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు.
Related News
CM Jagan: ప్రముఖ దర్శకుడిని మోసం చేసిన సీఎం జగన్
ఆర్. నారాయణ మూర్తి గతంలో సీఎం జగన్ ని కలిశారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ గురించి మాత్రమే కాకుండా తన ఊరులో నీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ కి మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ కూడా వెంటనే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేశారు.