Green Energy : ఏపీకి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్ స్టోరేజ్ విద్యుత్ను పూడిమాడకకు తెస్తే వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఉత్పత్తయ్యే హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని అన్నారు.
- By Latha Suma Published Date - 02:53 PM, Sat - 11 January 25

Green Energy : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందని అన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్ స్టోరేజ్ విద్యుత్ను పూడిమాడకకు తెస్తే వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఉత్పత్తయ్యే హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని అన్నారు.
గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ను టెకోవర్ చేసి గ్రీన్ ఆమ్మోనియాను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ ప్లాంట్ మీద 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతులు జరుగుతాయి. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్సెడ్ గ్యాస్ తయారీకి 500కేంద్రాలు పెడుతోంది. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఎగుమతులు పెరిగి మనకి లాభం వస్తుంది. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తుల కి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుంది. ఎన్టీపీసీ లో బొగ్గు మండించటం ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ ని పూడిమడక తెచ్చి హైడ్రోజన్ ఉత్పత్తి కి వాడితే కాలుష్యం తగ్గుతుంది.
బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీలు మోడల్ను కుప్పంకి తెచ్చిందన్నారు. కుప్పంలో సూర్యఘర్ అమల్లో ఉన్న ఇళ్లకు స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకునేందుకు ఇంటి యజమానికి డబ్బులు చెల్లిస్తుందని అన్నారు. ఇది కుప్పం సూర్యఘర్ ఇంటి వాసులకు అదనపు ఆదాయం కానుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్సెడ్ గ్యాస్ తయారీకి 500కేంద్రాలు పెడుతోందని వివరించారు. ఒక్కో కేంద్రం రూ.130కోట్ల పెట్టుబడి పెడుతున్నారని చెప్పారు. బయోగ్యాస్కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుందని తెలిపారు. ఈ గడ్డి పెంచటానికి ఎకరాకు రూ.30వేల కౌలు రైతులకు రిలయన్స్ చెల్లిస్తుందన్నారు. ఈ కేంద్రాల వల్ల ఉద్యోగాలు వచ్చి, గ్యాస్ ఉత్పత్తిలో వచ్చే వ్యర్థాలు భూసారం పెంచేందుకు ఎరువు గానూ ఉపయోగపడుతుందని చెప్పారు.
పిల్లల్లో సృజనాత్మకత పెంచటానికి యాప్ల సాయంతో శిక్షణ ఇస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం అని సీఎం అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నాం. మిగిలిన వారికి కూడా సౌర ఫలకాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ రాయితీ పోను మిగిలిన ఫలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకూ కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటాం. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చాక యూనిట్ మొత్తం ఇంటి యజమానికి అప్పగిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Read Also: Pawan Kalyan : రూ.10 లక్షల పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా ?