HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Prime Minister Modi Live Updates

PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

  • By Vamsi Chowdary Korata Published Date - 10:54 AM, Thu - 16 October 25
  • daily-hunt
Modi Chandrababu Pawan Kaly
Modi Chandrababu Pawan Kaly

ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ సభలో ప్రసంగించిన తర్వాత కర్నూలు విమానాశ్రయం చేరుకుని సాయంత్రం 4.45కు దిల్లీ బయల్దేరి వెళ్తారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

కర్నూలు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల విజనరీ నాయకత్వం ఉందని అన్నారు. ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సహాకారంతో ఏపీ ప్రగతిలో దూసుకెళ్తోందని చెప్పారు.

కర్నూరు జిల్లా ఓర్వకల్లులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని మొత్తం రూ.13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

తాను చాలా మంది ప్రధాన మంత్రులతో పనిచేశానని, కానీ, నరేంద్ర మోదీ లాంటి శక్తివంతమైన నేతను చూడలేదని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. మోదీ సంకల్పంతో 11 ఏళ్ల కిందట 11వ స్థానంలో ఉన్న భారత్.. ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరుకుందని, ఇదంతా మోదీ గొప్పదనమని బాబు అన్నారు.

కర్నూరు జిల్లా నన్నూరులో జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రధాని మోదీ దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారని అన్నారు. అలాగే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు పాలన కొనసాగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం దేవస్థానానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి శ్రీశైలం ఆలయంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ స్వామివారిని తొలిసారి దర్శించుకున్నారు.

ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకున్నారు..కర్నూలు ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం దర్శించుకోనున్నారు.

ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ స్వాగతం

On behalf of my people of Andhra Pradesh, I warmly welcome our Hon’ble Prime Minister, Shri @narendramodi Ji, to our state. pic.twitter.com/uaYSKnXZ6R

— N Chandrababu Naidu (@ncbn) October 16, 2025

 

 

భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, ఇతరులు స్వాగతం పలికారు. మోదీ కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి శ్రీశైలం బయల్దేరి వెళ్లారు.

 

శ్రీశైల మహాక్షేత్రానికి ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ వస్తుండగా.. గతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావులు ప్రధానులుగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు.

 

కర్నూలులో జరిగే సభా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్‌ మాట్లాడనున్నారు. మంత్రి టీజీ భరత్‌ స్వాగతోపన్యాసం చేస్తారు.

 

వాస్తవానికి ప్రధాని మోదీతో కర్నూలులో రోడ్‌షో నిర్వహించాలని ముందు నిర్ణయించారు. కానీ ఆ తర్వాత బహిరంగసభగా మార్పు చేశారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు సభా ప్రాంగణంలోనే టెంట్ల మధ్యలో నిర్మించిన రహదారిపై వాహనం పైనుంచి ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్‌షోగా వేదిక వరకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. కర్నూలులో జరిగే సభ మధ్యాహ్నం 2.30 నుంచి 4.10 వరకు ఉంటుంది.

 

కర్నూలులో జరిగే సభా వేదికపూ.. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూర్చుంటారు. వీరతో పాటుగా రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్‌ యాదవ్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్.. ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు.. ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉంటారు.

 

ఏపీ పర్యటనకు వచ్చే ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి’ అన్నారు ప్రధాని


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhara cm chandrababu
  • kurnool
  • Nandyal
  • pawankalyan
  • PMModi

Related News

Cbn

Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ – జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారు – శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువైన నేల శ్రీశైలం – బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ – సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి – 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారు – 21వ శతాబ్దం మోదీ

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

  • Netanyahu Pm Modi

    Modi : గత రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడింది.!

Latest News

  • ‎Amla: ఉసిరికాయ మంచిదే కానీ వీరికి మాత్రం చాలా డేంజర్.. తిన్నారో ఇంక అంతే సంగతులు!

  • Kaps Cafe Attack : కపిల్ శర్మ కేప్పై మరోసారి కాల్పులు

  • ‎Dhanteras 2025: ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల అస్సలు కొనకండి.. కొన్నారో అంతే సంగతులు!

  • ‎Spiritual: ఐశ్వర్యాన్ని ప్రసాదించే గోధుమల దీపం.. దీపావళి రోజు ఎలా వెలిగించాలో తెలుసా?

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

Trending News

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd