HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modi Tour Schedule Announcement

pm vizag tour: ప్ర‌ధాని విశాఖ షెడ్యూల్ ఖ‌రారు, మ‌ళ్లీ జ‌న‌సేనానికి జ‌ల‌క్‌!

ముసుగులో గుద్దులాట మాదిరిగా జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడ‌ర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా క‌లిసి ప‌నిచేయ‌రు. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌మానించేలా ఏపీ బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు పాల్గొనే వేదిక‌ల‌పై ప‌వ‌న్ కు చోటు దొర‌క‌డంలేదు.

  • Author : CS Rao Date : 02-11-2022 - 4:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Modi
Jagan Modi

ముసుగులో గుద్దులాట మాదిరిగా జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడ‌ర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా క‌లిసి ప‌నిచేయ‌రు. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌మానించేలా ఏపీ బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు పాల్గొనే వేదిక‌ల‌పై ప‌వ‌న్ కు చోటు దొర‌క‌డంలేదు. అయిన‌ప్ప‌టికీ బీజేపీతో ఆయ‌న కొన‌సాగ‌డం అంత‌బ‌ట్ట‌ని అంశం.

ఈనెల 11వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏపీ రాష్ట్రానికి వ‌స్తున్నారు. విశాఖ కేంద్రంగా జ‌రిగే ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటారు. ప‌లు ప‌థ‌కాలకు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలకు ఈనెల 12న ఆయ‌న హాజ‌రవుతారు. ప్ర‌ధాని షెడ్యూల్ కు సంబంధించిన రూట్ మ్యాప్ వెలువ‌డింది. కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఈసారి కూడా చోటులేక‌పోవ‌డం అవ‌మానంగా జ‌న‌సేన ఫీల్ కావ‌డం స‌హ‌జం.

షెడ్యూల్ ప్ర‌కారం ఈనెల 11న ఐఎన్ఎస్ వద్ద ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి స్వాగతం ప‌లుకుతారు. అక్కడి నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి మోడీ చేరుకుంటారు. రాత్రికి ఐఎన్ఎస్ బంగ‌ళాలో బస చేస్తారు. మరుసటి రోజు ఆంధ్రా యూనివర్సిటీ మైదానానికి చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మోడీ దాదాపు 14 ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

తూర్పుగోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం కేంద్రంగా జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణకు ఇటీవ‌ల మోడీ వ‌చ్చారు. ఆ సంద‌ర్భంగా మెగా స్టార్ చిరంజీవికి ల‌భించిన ఆహ్వానం జ‌న‌సేనాని ప‌వ‌న్ కు మాత్రం అంద‌లేదు. పైగా చిరంజీవికి వేదిక‌పై మోడీ ఇచ్చిన ప్రాధాన్యం ప‌లు రాజ‌కీయ కోణాల‌ను ఆవిష్క‌రించింది. సిట్టింగ్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజుతో పాటు ప‌వన్ కు ఆహ్వానం లేకుండా జ‌గన్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించింది. అంతేకాదు, టీడీపీ త‌ర‌పున ఆహ్వానం ఇచ్చిన‌ప్ప‌టికీ ప్రోగ్రామ్ స‌మ‌యానికి ప్రొటోకాల్ లేకుండా చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఈనెల 11న విశాఖ‌కు వ‌స్తోన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖరారు అయింది. అయితే, ఈసారి కూడా ప‌వ‌న్ కు ఏ మాత్రం అవ‌కాశం లేకుండా జ‌గ‌న్ స‌ర్కార్ టూర్ ఫిక్స్ చేసింది. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు ఉన్నామ‌ని చెప్పుకునే జ‌న‌సేన‌కు ఈసారి మోడీ టూర్ మ‌రింత బాధ‌ను క‌లిగిస్తోంది. రెండు వారాల క్రితం విశాఖ కేంద్రంగా ప‌వ‌న్ కు జ‌రిగిన అవ‌మానం పొత్తుల ప్ర‌కంప‌న‌ల‌ను రేపింది. బీజేపీతో క‌టీఫ్ చేసుకుంటూ ప‌వ‌న్ నోటి వెంట ప‌రోక్షంగా సంకేతాలు వెలువ‌డ్డాయి. ఆ లోపు ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల నుంచి ఫోన్లు వ‌చ్చాయ‌ని జ‌న‌సేన బ‌య‌ట‌కు చెప్పుకుంది. ఎలాంటి ఫోన్ కాల్స్ ప్ర‌ధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి ప‌వ‌న్ కు రాలేద‌ని ఆల‌స్యంగా వెలుగుచూసింది.

బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తోన్న ప‌వ‌న్ కు మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విశాఖ రాక సంద‌ర్భంగా అవ‌మానం జరుగుతుంద‌ని షెడ్యూల్ ఆధారంగా అర్థం అవుతోంది. ఒక రాజ‌కీయ పార్టీ అధినేత‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసే అవ‌కాశం ప‌వ‌న్ కు ఉంటుందా? ఉండ‌దా? అనేది కూడా సందేహ‌మే.

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • Janasena
  • modi
  • Pavan kalyan
  • vizag
  • vizag beach
  • vizag tour

Related News

Shivam Dube

వైజాగ్ లో దూబే తాండవం 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఊచకోత

Shivam Dube  న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ – 20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దుబే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, 23 బంతుల్లో 65 పరుగులు సాధించి రికార్డులు సృష్టించాడు. దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగిన దుబే, భారత్ ఓటమిని ఆపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 215 పరుగులు చేయగా.. భారత్ 165 పరుగులకే ఆ

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • Arava Sridhar Janasena Mla

    రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd