HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan To Interact With Farmers In Godavari Dists

Pawan Kalyan: పవన్ రాకతో ధాన్యం కొనుగోలు వేగవంతం

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నీటి పాలవ్వడంతో తమ బాధ వర్ణనాతీతం. నష్టపోయిన రైతులు తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు

  • Author : Vamsi Chowdary Korata Date : 10-05-2023 - 3:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena
Pawan Kalyan

Pawan Kalyan; ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నీటి పాలవ్వడంతో తమ బాధ వర్ణనాతీతం. నష్టపోయిన రైతులు తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. కానీ ఫలితం లేదని వాపోతున్నారు. ఇక నష్టపోయిన పంటను, రైతన్నలను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ రైతుల్ని పరామర్శించారు. అలాగే మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.

పవన్ కళ్యాణ్ పర్యటనలో రైతులు తమ బాధలను చెప్పుకున్నారు. మాది రైతు ప్రభుత్వం..రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పుకునే ఏ నాయకుడు కూడా మాకు అండగా లేడని గోడు వెళ్లబోసుకున్నారు. మమ్మల్ని పరామర్శించేందుకు ఏ ఒక్క అధికారి రాలేదని బాధపడ్డారు. మీరు వస్తున్నారని తెలిసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసినట్టు రైతులు పవన్ కు చెప్పారు. ఇప్పటివరకు అయిన ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని, ఇదే సమయంలో మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని వాపోయారు.

మరోవైపు అకాల వర్షాల కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు గత ప్రభుత్వం కంటే మేమే మంచి చేస్తున్నామంటూ డబ్బా కొట్టుకునే సీఎం జగన్‌ అన్నదాతలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని ఫైర్ అవుతున్నారు రైతులు. క్యాంపు కార్యాలయంలో కూర్చుని ల్యాప్‌టాప్‌లో బటన్ నొక్కితే సరిపోతుందా.. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు తెలుసుకునే తీరిక లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు పాడై, ధాన్యం తడిసిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులను సీఎం జగన్ కనీసం పరామర్శించకపోవడం తీవ్ర విమర్శలు తావిస్తోంది.

Read More: Revanth Vs Talasani: తలసానిపై రేవంత్ ఫైర్.. ఘాటైన పదజాలంతో కౌంటర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm jagan
  • Crop Damage
  • farmers
  • Pawan Kalyan
  • rains

Related News

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd