HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Our Goal Is The Welfare Of The Poor Cm Chandrababu

CM Chandrababu : పేదల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం.

  • Author : Latha Suma Date : 31-05-2025 - 3:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Our goal is the welfare of the poor: CM Chandrababu
Our goal is the welfare of the poor: CM Chandrababu

CM Chandrababu : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని చెయ్యేరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పేదలకు సేవ చేయడంలో కలిగే ఆనందం మరెక్కడా లభించదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో ఇది ప్రధానమైనదని తెలిపారు. ప్రజావేదికలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం. పింఛన్ల పునాది ఏనాడో ఎన్టీఆర్ వేయగా, నేడు అదే పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తున్నాం. ప్రతి లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి పింఛను అందించేందుకు చర్యలు తీసుకున్నాం. ఎక్కడ ఉన్నా వారు వేచి ఉండాల్సిన అవసరం లేదు అని ఆయన వివరించారు.

Read Also:PM Modi : ‘ఆపరేషన్ సిందూర్’లో నారీశక్తి వికాసం: ప్రధాని మోడీ 

ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక పింఛన్లు అందించే రాష్ట్రంగా నిలిచిందని, ఇది తమ ప్రభుత్వం పేదల పట్ల తీసుకుంటున్న విధానానికి నిదర్శనమని సీఎం అన్నారు. మా ప్రభుత్వం పేదల పట్ల నిబద్ధత కలిగి ఉంది. ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఇవ్వడమే కాక, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యను బలోపేతం చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి మూడుపూటలు అన్నం పెట్టాలన్న సంకల్పంతో ముందుకుసాగుతున్నాం అని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా పేదల కోసం పనిచేయాలన్నదే తమ దృఢ సంకల్పమని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామానికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారికీ నేరుగా సమస్యలు అర్థమవుతాయని చెప్పారు.

పింఛన్లు ఇవ్వడమే కాకుండా, ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని అందించాలన్నదే మా లక్ష్యం. చేప ఇవ్వడమే కాదు, పట్టిచ్చే మార్గాన్ని చూపించాలన్నదే మా విధానం. భర్త చనిపోతే, ఆటోమేటిక్‌గా భార్యకు పింఛను అందే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. అంతేకాక, మూడు నెలల వరకు పింఛను తీసుకునే అవకాశం కల్పించాం. భార్య అనాథగా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని సీఎం వివరించారు. చివరగా చంద్రబాబు పేదల సంక్షేమం పట్ల మేము పూర్తి నిబద్ధతతో ఉన్నాం. ఈ రాష్ట్రం పేదల పాలనను ఆస్వాదిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ప్రతి ఒక్కరూ ఈ సంకల్పంలో భాగస్వాములవ్వాలి అని స్పష్టం చేశారు.

Read Also: Suryakumar Yadav: ముంబై ఇండియ‌న్స్‌కు షాక్.. సూర్య‌కుమార్ యాద‌వ్‌కు గాయం?!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ambedkar konaseema district
  • CM Chandrababu
  • ntr
  • pensions Distribution

Related News

Tdp Announces District Pres

జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గానికి చెందిన వారు 8 మంది, మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు

  • Sanatana Dharma

    దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

    సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Latest News

  • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

  • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

  • వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!

  • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

  • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd