HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >New Direction For Public Governance With The Blessings Of The People Ap Cm Chandrababu

CM Chandrababu : ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలనకు నూతన దిశ: ఏపీ సీఎం చంద్రబాబు

ప్రజల ఆశయాలను నెరవేర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. ఎన్నో సవాళ్ల మధ్య, ముఖ్యంగా ఆర్థిక ఒడిదుడుకుల మధ్య, మేము ముందుకు సాగుతున్నాం. పేదల సేవలో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.

  • By Latha Suma Published Date - 11:32 AM, Thu - 12 June 25
  • daily-hunt
New direction for public governance with the blessings of the people: AP CM Chandrababu
New direction for public governance with the blessings of the people: AP CM Chandrababu

CM Chandrababu : ప్రజల ఆశీస్సులతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజల ఆకాంక్షలే తమ ప్రభుత్వం అడుగులకు బలమని పేర్కొంటూ, సేవా దృక్పథంతో ప్రతి రోజు శ్రమిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఒక ప్రకటనను షేర్ చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. ఎన్నో సవాళ్ల మధ్య, ముఖ్యంగా ఆర్థిక ఒడిదుడుకుల మధ్య, మేము ముందుకు సాగుతున్నాం. పేదల సేవలో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.

Read Also: Corona : కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం

ఈ ఏడాదిలో ప్రభుత్వ సంక్షేమ హామీలు ప్రజలకు చేరేలా ఎన్నో చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్లు, దీపం-2 పథకం, తల్లికి వందనం, మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలు వంటి పథకాలు పెద్ద ఎత్తున అమలులో ఉన్నాయని వివరించారు. అదనంగా మెగా డీఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. రైతులకు అండగా నిలబడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఇప్పటివరకు 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఆదాయానికి భరోసా కల్పించామన్నారు. ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించనున్నాం అని వెల్లడించారు. అలాగే, సాగునీటి ప్రాజెక్టులకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఎకరానికి నీటిని అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పలు కీలక రంగాల్లో ముందడుగు వేశామని సీఎం తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభించబడిందని, పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ వేగంగా సాగుతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి ప్రత్యేక రైల్వే జోన్ సాధించిన విషయం, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించడంలో ప్రభుత్వ ప్రయాసలను గుర్తు చేశారు. మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మాకు ఊపిరిగా ఉంది. ప్రజల ఆశలే మాకు మార్గదర్శకం. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపడతామని హామీ ఇస్తున్నాను. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చంద్రబాబు అన్నారు. ఇదే ప్రజల్లో విశ్వాసం పుట్టించే పాలనకు తొలి అడుగని ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరింత విజయవంతమైన పాలనను అందిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also:Adani : ఆరేళ్లలో రూ.8.3 లక్షల కోట్ల పెట్టుబడి.. అదానీ గ్రూప్ భారీ కేపెక్స్ ప్రణాళిక 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Coalition Government
  • Economic fluctuations
  • Many welfare programs
  • One-year rule

Related News

YS Jagan

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • CM Chandrababu

    Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. మ‌రో హామీ అమ‌లు!

  • Kuppam

    Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్‌!

Latest News

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd