Accident : నర్సాపురం – ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది
ఆదివారం తెల్లవారుజామున నర్సాపూర్-ధర్మవరం రైలుకు పెనుప్రమాదం తప్పింది
- By Sudheer Published Date - 12:48 PM, Sun - 30 July 23
నర్సాపూర్-ధర్మవరం రైలు (Narasapur-Dharmavaram Train)కు ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. ఈ మధ్య వరుస రైలు ప్రమాదాలు (Train Accidents) రైలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నెలలో కనీసం రెండు ప్రమాదాలైన జరుగుతున్నాయి. ఈ రెండు , మూడు నెలల్లో గోదావరి ఎక్స్ ప్రెస్ , కోరమాండల్ ఎక్స్ ప్రెస్ , ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ తదితర రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద దేశ వ్యాప్తంగా భయబ్రాంతులకు గురి చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 270 కి పైగా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదం తర్వాత కూడా పలు రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజాగా ఆదివారం తెల్లవారుజామున నర్సాపూర్-ధర్మవరం రైలుకు పెనుప్రమాదం తప్పింది. కావలి, బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వారు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ పట్టా ముక్కును వేగంగా వస్తున్న నర్సాపురం-ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పట్టా ముక్క దూరంగా పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ పట్టా ముక్క రెండు మీటర్ల పొడవు ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తులు కావాలని అడ్డుగా పెట్టినట్లు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. లోక్ పైలట్ సమాచారంతో రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టాలను ఎవరు అడ్డుగా పెట్టారనే దానిపై పోలీసులు (Police ) ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని ప్రశ్నిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని , ఎవర్ని వదిలే ప్రసక్తి లేదని చెబుతున్నారు. రైలు పట్టా దూరంగా పడటంతో ప్రమాదం తప్పదని, లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది చెబుతున్నారు.
Read Also : Flooded : వరదలో మునిగిన జగనన్న కాలనీ లపై పవన్ ట్వీట్..
Related News
AP : ఏపిలో ఈ- ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఈసీ
E-Office: ఏపిలో ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఆదేశించింది. ఏపిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ స్టాఫ్ట్ వేర్ను అప్గ్రేడ్ చేఏందుకు ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) ఈనెల18 నుండి 25 వరకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. అయితే గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో �