Lokesh: రేపటి నుంచి లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర..వివరాలు..
- By Latha Suma Published Date - 02:05 PM, Wed - 6 March 24
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర(shankaravam yatra) చేపడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాయలసీమ(Rayalaseema)లో పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడానికి గురువారం (ఈ నెల 7) హిందూపురం(Hindupuram) నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై కేడర్ కు యువనేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా మన టీడీపీ(tdp), బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలతో భేటీ అయి వారికి ప్రశంసాపత్రాలను అందజేస్తారు. తొలివిడతలో ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపింది.
టీడీపీ-జనసేన (tdp-jana sena) కార్యకర్తలతోపాటు పెద్దఎత్తున ప్రజలు శంఖారావం సభలవద్దకు చేరుకొని సైకోపాలనలో తాము పడుతున్న ఇబ్బందులను యువనేతకు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో శంఖారావం మలివిడత యాత్రను తన మామ, ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి ప్రారంభించనున్నారు. తొలిరోజు ఉదయం హిందూపురం, మధ్యాహ్నం మడకశిర, సాయంత్రం పెనుకొండ నియోజకవర్గాల్లో శంఖారావం సభలు నిర్వహిస్తారు. ఈ నెల 8 న ఉదయం పుట్టపర్తి, మధ్యాహ్నం కదిరి సభలకు లోకేశ్ హాజరవుతారు. శివరాత్రి నేపథ్యంలో 9న యాత్రకు తాత్కాలిక విరామం ఉంటుంది. తిరిగి ఈ నెల 10 నుంచి యాత్ర యథావిధిగా కొనసాగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ విధ్వంసక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు స్వాంతన చేకూర్చి, ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా యువనేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అధికారపార్టీకి కంటిమీద కునుకులేకుండా చేసింది. 226 రోజులపాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3132 కి.మీ.లు సాగిన పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. ఈ అనూహ్య స్పందనను చూసి సహించలేక యువగళం యాత్రను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం కుట్రపన్నింది.
read also : Faith Torres: ఈ దేశ సుందరి మిస్ వరల్డ్ అవుతుందా..? ఎవరీ ఫెయిత్ టోర్రెస్..?
పార్టీ అధినేత చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి జైలులో పెట్టడంతో యువగళానికి 79 రోజులపాటు సుదీర్ఘ విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విశాఖ జిల్లా అగనంపూడి వద్ద యువగళాన్ని గత ఏడాది డిసెంబర్ 18న అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సిద్ధంచేయడంతోపాటు బాబు సూపర్ – 6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువనేత లోకేశ్ శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో సూపర్ సక్సెస్ సాధించిన యువగళం స్పూర్తితోనే లోకేశ్ శంఖారావాన్ని పూరించారు.
యువనేత నారా లోకేశ్ శంఖారావం వివరాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 7-3-2024 (గురువారం) కార్యక్రమ వివరాలు
హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (జీటీఎం లేఅవుట్, లోటస్ పబ్లిక్ స్కూలు దగ్గర)
ఉదయం 10.00 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.
10.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
10.32 – హిందూపూర్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఆకుల ఉమేష్ ప్రసంగం.
10.34– హిందూపూర్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నందమూరి బాలకృష్ణ ప్రసంగం.
10.36– హిందూపూర్ నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.00 – యువనేత నారా లోకేశ్ మడకశిర నియోజకవర్గానికి చేరిక.
2.30 – మడకశిర నియోజకవర్గంలో భోజన విరామం.
మధ్యాహ్నం:: మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం (చీపులేటి గ్రామం, మడకశిర మున్సిపాలిటీ)
2.30 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.
2.35 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.
2-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
3.02 – మడకశిర నియోజకవర్గ జనసేన సమన్వయకర్త టి. రంగస్వామి ప్రసంగం.
3.04 – మడకశిర నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఎమ్.ఈ సునీల్ కుమార్ ప్రసంగం.
3.06– మడకశిర నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేశ్ ప్రసంగం.
3.26– పార్టీ కేడర్ తో యువనేత లోకేశ్ ముఖాముఖి.
3.54– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.
3.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.59 – పార్టీకేడర్ తో యువనేత లోకేశ్ సెల్ఫీ.
4.55 – యువనేత పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
సాయంత్రం:: పెనుకొండ నియోజకవర్గం (తేజో కిరణ్ ఫ్యాక్టరీ, మడకశిర రోడ్, పెనుకొండ)
5.00 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.
5.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.
5-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.32 – పెనుకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఈడిగ కుమార్ ప్రసంగం.
5.34 – పెనుకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఎస్.సవిత ప్రసంగం.
5.36 – పెనుకొండ నియోజకవర్గ శంఖారావంలో యువనేత నారా లోకేశ్ ప్రసంగం.
5.56 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేశ్ ముఖాముఖి.
6.26 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
6.28 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేశ్ ప్రతిజ్ఞ.
6.29 – పార్టీ కేడర్ తో యువనేత లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.30 – రోడ్డుమార్గం ద్వారా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రయాణం
7.15 – పుట్టపర్తి నియోజకవర్గానికి చేరుకుని, అక్కడ బస చేస్తారు.
Related News
Nara Brahmani : లోకేష్కు మంగళగిరిని విడిచిపెట్టమని చాలా సలహాలు ఇచ్చారు
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఓటమి పాలయ్యారు.