Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్.. నా భర్త లేకుండా తొలిసారి..?
నారా భువనేశ్వరి భావోద్వేగంతో ట్వీట్ చేశారు. తన భర్త చంద్రబాబు నాయుడు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళానని..
- By Prasad Published Date - 07:14 AM, Wed - 25 October 23
నారా భువనేశ్వరి భావోద్వేగంతో ట్వీట్ చేశారు. తన భర్త చంద్రబాబు నాయుడు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళానని.. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే తాను అయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళానంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించిందని.. ప్రతి నిమిషం భారంగా గడిచిందని పేర్కొన్నారు. ఆ ఏడుకొండల వాడి దయతో, తమ ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నానని.. దీనిలో భాగంగా చంద్రగిరిలో ప్రజల కోసంతొలి అడుగు వేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు 45 రోజులుగా రిమాండ్లో ఉన్నారు. అప్పటి నుంచి నారా భువనేశ్వరి రాజమండ్రిలో ఉంటూ కార్యకర్తలను, నాయకులను కలుస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలకు ఆమె సంఘీభావం తెలిపారు. తాజాగా ఆమె జనంలోకి వస్తున్నారు. నిజం గెలవాలంటూ భువనేశ్వరి యాత్రను ఈ రోజు ప్రారంభించనున్నారు. దీని కోసం టీడీపీ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది.
Also Read: TDP : అధికారం కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతుంది – టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది