YS Jagan: ఏపీ సీఎం జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు..!
- By HashtagU Desk Published Date - 04:07 PM, Thu - 24 March 22
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారన్న అభియోగంపై నాంపల్లికోర్టు విచారణ చేసింది.
ఈ మేరకు సీఎం జగన్ విచారకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం జగన్ హాజరుకావాలని నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే లకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సీఎం జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిలలు పలుమార్లు హాజరు అయ్యారు. అయితే ఇప్పుడు సీఎం జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
Related News
TS : గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉంది: సీఈఓ వికాస్ రాజ్
Telangana: రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్పై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్(Chief Election Officer Vikas Raj) మీడియాతో మాటాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగానే ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్లో మాత్రమ ఎప్పటిలాగానే ఈ సారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర �