Nara Lokesh : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – అక్షర సారథి లోకేష్!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది
- Author : Sudheer
Date : 01-05-2026 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే విద్యను రాజకీయాలకు దూరం చేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో విద్యావ్యవస్థపై పడిన రాజకీయ రంగులను తొలగిస్తూ, పాఠశాల గేటు లోపలికి రాజకీయాలకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టించారు. ప్రభుత్వ పథకాలకు తన సొంత ఫోటోలు లేదా పార్టీ రంగులు వాడకుండా, మహనీయులైన డొక్కా సీతమ్మ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేడ్కర్ మరియు అబ్దుల్ కలాం వంటి వారి పేర్లు పెట్టడం ఆయన నిజాయితీకి నిదర్శనం. విద్యార్థులకు అందించే పుస్తకాలు, దుస్తులు మరియు క్రీడా పరికరాలపై కూడా ఎటువంటి రాజకీయ ప్రచార చిత్రాలు ఉండకూడదని కచ్చితమైన ఆదేశాలిచ్చి అమలు చేస్తున్నారు.

Ap 10th
పారదర్శకతకు పట్టం
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన విజయాన్ని లోకేష్ వినూత్నంగా చాటిచెప్పారు. భారత దేశ విద్యా చరిత్రలోనే తొలిసారిగా, ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ప్రతిభ చాటిన విద్యార్థుల ఫోటోలు, వారు సాధించిన మార్కులు మరియు స్కూళ్ల వివరాలతో పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఇందులో ప్రభుత్వం ‘నెంబర్ వన్’ అని డబ్బా కొట్టుకోకుండా, విద్యార్థుల శ్రమను గౌరవిస్తూ వారిని సమాజం ముందు హీరోలుగా నిలబెట్టారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభను చాటిచెప్పిన ఈ ప్రకటన ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది.
‘ఏపీ మోడల్’ దిశగా పయనం
కార్పొరేట్ పాఠశాలల వ్యాపార ధోరణికి భిన్నంగా, ప్రభుత్వ పాఠశాలల్లో “అమ్మలా శిక్షణ – నాన్నలా రక్షణ” అనే నినాదంతో లోకేష్ ముందుకు సాగుతున్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయుల బోధన, స్నేహపూర్వక వాతావరణం ప్రభుత్వ బడుల బలం అని చాటిచెబుతూ, తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా పిలుపునిచ్చారు. తప్పులను ఒప్పుకుంటూ, లోపాలను సరిదిద్దుకుంటూ పారదర్శకతతో ఆయన సాగిస్తున్న ఈ ‘మిషన్’ ఫలితంగానే ఇంటర్ మరియు పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యాలయాలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ దిశగా అడుగులు పడుతున్నాయి.