AP Politics: పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? : మంత్రి రోజా
మంత్రి రోజా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు
- By Praveen Aluthuru Published Date - 02:57 PM, Sat - 29 July 23
AP Politics: మంత్రి రోజా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో, పురందేశ్వరి ఆయన మాట్లాడింది మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె దేనికి అధ్యక్షురాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె పురందేశ్వరిపై వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అప్పులపై పురందేశ్వరి స్టేట్మెంట్స్ షాకింగ్ గా ఉన్నాయని, దేశంలో తక్కువ అప్పు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్వయంగా ఫైనాన్స్ మినిష్టర్ నిర్మల సీతారామన్ చెప్పారని, అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం ఏపీ అప్పులపై మరోలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ లెక్కలు తప్ప? పురందేశ్వరి లెక్కలు కరెక్టా అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఆమె చంద్రబాబుపై కూడా కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం శోచనీయమన్నారు. బాబుకి నదుల అనుసంధానం చేయడం కంటే నిధుల అనుసంధానంపై ఫోకస్ చేశారని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజి స్టార్ అంటూ వ్యాఖ్యానించారు రోజా. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసమే పార్టీ నడుపుతున్నారని ఆరోపించారు. పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు 175 స్థానాల్లో పోటీ చేయని పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పార్టీ పెట్టినట్టు ఏ మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడమే ధ్వేయంగా పెట్టుకున్నారని విమర్శించారు మంత్రి రోజా.
Also Read: Harish Rao: బీజేపీ శాపం, కాంగ్రెస్ పాపం తెలంగాణకు అవసరమా: హరీశ్ రావు
Related News
AP Poll : హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన
రాష్ట్రంలో పోలింగ్ సందర్బంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్న ఓటర్ల దగ్గరకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అడుగుతుండటం..పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ.. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేయడం..పలు చోట్ల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుండడం..టిడిపి ఏజెంట్ లను కిడ్నాప్ చేయడం..లైన్లో రమ్మన్నా ఓట�