HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Minister Nara Lokesh Accepts Pawan Kalyans Challenge

Nara Lokesh : పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన మంత్రి నారా లోకేశ్

ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌కు స్పందనగా తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ గారు కోటి మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నాను. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటాలని మేము సంకల్పించాం అని లోకేశ్ స్పష్టం చేశారు.

  • By Latha Suma Published Date - 06:01 PM, Thu - 10 July 25
  • daily-hunt
Minister Nara Lokesh accepts Pawan Kalyan's challenge
Minister Nara Lokesh accepts Pawan Kalyan's challenge

Nara Lokesh : శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి నిర్వహించిన “మెగా పీటీఎం 2.0” కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సంచలనాత్మక ప్రకటన చేశారు. పచ్చదనాన్ని ప్రోత్సహించేందుకు కోటి మొక్కలు నాటే విస్తృత ప్రణాళికను విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌కు స్పందనగా తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ గారు కోటి మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నాను. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటాలని మేము సంకల్పించాం అని లోకేశ్ స్పష్టం చేశారు.

Read Also: Constipation : జీర్ణక్రియకు హాని కలిగించే అలవాట్లు..మలబద్ధకాన్ని నియంత్రించడానికి ఆయుర్వేద చిట్కాలు!

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఒక శుభారంభమని, ప్రతి పాఠశాలలో మొక్కలు నాటటం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత కలుగుతుందని అభిప్రాయపడ్డారు. విద్యా రంగంలో రాష్ట్రం దూసుకెళ్తోందని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు సమానంగా తీర్చిదిద్దడం లక్ష్యమని తెలిపారు. చదువు మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో సంపూర్ణ వికాసం కోసం ఆటలు, సంగీతం, యోగా వంటి కార్యకలాపాలను కూడా ప్రవేశపెట్టాం. ఇది వారికి మానసిక మరియు శారీరక ఆరోగ్యంలో సహాయపడుతుంది అని వివరించారు. గురువుల పాత్రకు విశేష ప్రాముఖ్యత కలదని, వారు విద్యార్థుల జీవితాలను మలిచే ప్రధాన శిల్పులని కొనియాడారు.

తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులపై గరిష్ట ప్రభావం చూపే వారు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఎలాంటి రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తే మనకు ముఖ్యం. వారి ప్రగతి కోసం ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండాలి అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచే విధంగా ఈ మొక్కల నాటకం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ప్రతి మొక్కను విద్యార్థులు తమ తల్లిదండ్రుల పేరుతో నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. దీని ద్వారా పాఠశాలలు కేవలం విద్యా కేంద్రాలుగా కాక, సమాజ అభివృద్ధికి మార్గదర్శక కేంద్రాలుగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కోటిమొక్కల యజ్ఞం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదు… ఇది ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగే ఉద్యమమని, దీనివల్ల రాష్ట్రం పచ్చదనంతో విరాజిల్లుతుందని లోకేశ్ నమ్మకం వ్యక్తం చేశారు. విద్యాశాఖ నుంచే ఈ మహా ప్రక్రియ ప్రారంభమవడం గర్వకారణమని పేర్కొన్నారు.

Read Also: Pawan Kalyan : మయన్మార్‌లో చిక్కుకున్న యువత..రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deputy CM Pawan Kalyan
  • Education Department
  • Mega PTM 2.0
  • Minister Lokesh
  • Pawan Challenge
  • Tree Plantation

Related News

Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

కేంద్రం నుండి రాష్ట్రానికి అవసరమైన మద్దతు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతితో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ లోతుగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో ముఖ్యాంశంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు అంశం ప్రస్తావించబడింది.

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd