Avanigadda Janasena Candidate : జనసేన లోకి మండలి బుద్ధప్రసాద్..?
అవనిగడ్డ స్థానం జనసేన కు వెళ్లడం తో అక్కడ ఎవర్ని బరిలోకి దించుతుందా అనే ఆసక్తి నెలకొంది. జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ వారికీ ప్రజల నుండి పెద్దగా మద్దతు రాలేదు
- By Sudheer Published Date - 09:55 AM, Mon - 1 April 24
అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ (Mandali Buddha Prasad) జనసేన (Janasena)లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ను కలిసి, పార్టీ మారబోతున్నట్లు సమాచారం. ఏపీలో ఎన్నికల హోరాహోరీ మొదలైంది. అధికార పార్టీ ఇప్పటీకే 175 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను , 25 స్థానాలకు గాను ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టగా..ఈసారి బిజెపి , టిడిపి , జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలోకి దిగబోతున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపిక అనేది తలకుమించిన భారంగా మారింది. ముఖ్యంగా టిడిపి , జనసేన పార్టీలు కీలక నేతలకు టికెట్స్ ఇచ్చుకుపోలేని పరిస్థితి వచ్చింది. దీంతో చాలామంది నేతలు టికెట్ రాకపోవడం తో పార్టీని వీడుతుండగా..మరికొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అవనిగడ్డ (Avanigadda ) స్థానం జనసేన కు వెళ్లడం తో అక్కడ ఎవర్ని బరిలోకి దించుతుందా అనే ఆసక్తి నెలకొంది. జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ వారికీ ప్రజల నుండి పెద్దగా మద్దతు రాలేదు. దీంతో ఎవర్ని నిలపెడతామని ఆలోచనలో ఉంది. ఇదే క్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్..జనసేన లో చేరి, అవనిగడ్డ టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇదే విషయమై పార్టీల అధినేతలతో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు బుద్ధప్రసాద్..పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను కలిసి పార్టీ కండువా కప్పబోతున్నట్లు వినికిడి. 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయనకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. దాంతో జనసేన అధినేత పవన్ కూడా బుద్ధప్రసాద్ ను పార్టీలోకి చేర్చుకొని..అవనిగడ్డ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారట. మరి బుద్ధప్రసాద్ కు టికెట్ ఇస్తే..ఈ టికెట్ కోసం ఎదురుచూస్తున్న జనసేన నేతలు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఆర్కే మెస్ అధినేత బండి రామకృష్ణ, న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు, సీనియర్ రాజకీయవేత్త బచ్చు వెంకటనాథ్ తదితరులు అసమ్మతి వ్యక్తం చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Read Also : Telangana: జహీరాబాద్లో 70 కిలోల గంజాయి స్వాధీనం, నలుగురి అరెస్ట్
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది