Lokesh Nara : యువగళం చిచ్చు! రాళ్ల దాడులు, లాఠీ చార్జి!!
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యువగళం(Lokesh Nara) కేంద్రంగా రాళ్లు, చెప్పులతో
- By CS Rao Published Date - 01:38 PM, Sat - 1 April 23
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కొనసాగుతోన్న యువగళం(Lokesh Nara) కేంద్రంగా రాళ్లు, చెప్పులతో వైసీపీ, టీడీపీ వర్గీయులు(Yuvagalam) ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ధ్వంసమైంది. తోపులాటలో రఘునాథ్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత రఘునాథ రెడ్డిని అరెస్టు చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పుట్టపర్తిలో భారీగా మోహరించిన పోలీసులు పట్టణంలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీస్ యాక్ట్ అమలులో ఉందని వెల్లడించారు.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యువగళం(Lokesh Nara)
ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ నుంచి సత్తెమ్మ ఆలయానికి చేరుకున్న పల్లె రఘునాథరెడ్డి అక్కడ ప్రమాణం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. శ్రీధర్ రెడ్డిపై పాదయాత్రలో లోకేశ్(Lokesh Nara) చేసిన ఆరోపణలన్నీ నిజమేనని తెలిపారు. ఎమ్మెల్యే వస్తే ఆధారాలతో నిరూపిస్తామని మరోసారి సవాల్ విసిరారు. దీంతో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
రాళ్లు, చెప్పులతో వైసీపీ, టీడీపీ వర్గీయులు
టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పుట్టపర్తి రణరంగంగా మారింది. యువగళం(Yuvagalam) పాదయాత్ర సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు నారా లోకేష్ చేశారు. దీంతో లోకేశ్ ను, పల్లె రఘనాథరెడ్డిని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో శ్రీధర్ రెడ్డి పోస్టులు పెట్టారు. దీంతో పుట్టపర్తి అభివృద్ధిపై చర్చకు రావాలని పల్లె రఘునాథరెడ్డి సవాల్ విసిరారు.
Also Read : Yuvagalam : మైనార్టీలకు లోకేష్ హామీ! ముస్లింల సంక్షేమానికి `ఇస్లామిక్ బ్యాంకు`!
ఈ నేపథ్యంలో సత్యమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు పల్లె రఘునాథ్రెడ్డి సిద్ధమయ్యారు. పుట్టపర్తి టీడీపీ ఆఫీసుకు ఆయన రాగా పోలీసులు అక్కడే రఘునాథ్ రెడ్డిని నిర్బంధించారు. మరోవైపు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. అయితే పల్లె రఘునాథ్ టీడీపీ కార్యాలయం గోడ దూకి పల్లె హనుమాన్ జంక్షన్కు వెళ్లారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చారు. ఇద్దరు నేతలూ సత్యమ్మ దేవాలయానికి చేరుకున్నారు. సత్యమ్మ గుడి దగ్గరికి వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత(Yuvagalam) చోటు చేసుకుంది. లాఠీ ఛార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. యువగళానికి కూడా అనుమతి లేకుండా చేశారు. మాజీ మంత్రి లోకేష్ (Lokesh Nara)చేసిన ఆరోపణలు ఇరు వర్గాలను ఘర్షణకు పురికొల్పాయి. దీంతో పాదయాత్రను. తాత్కాలికంగా పోలీసులు అడ్డుకున్నారు. తిరిగి మళ్లీ పాదయాత్ర ఎప్పుడు అనేది సందిగ్ధంగా ఉంది.
Also Read : Yuvagalam : పప్పు నుంచి పవర్ ఫుల్! లోకేష్ `డైట్` సీక్రెట్స్ !
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పుట్టపర్తి రణరంగంగా మారింది.
Related News
Mangalagiri: మంగళగిరిలో గెలుపు ఎవరిది? క్లియర్ కట్ అనాలసిస్..!
%%excerpt%% మంగళగిరిలో ఎవరు గెలుస్తారనే దానిపై.... హాట్ హాట్గా చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేకుండానే ఎమ్మెల్సీ నామినేషన్తో ఏకంగా మంత్రి అయ్యారు లోకేష్. ఎక్కడి నుండి బరిలో నిలబట్టాలని బాబు తీవ్రంగానే కసరత్తు చేశారంట. సుదీర్ఘ లెక్కల అనంతరం మంగళగిరిని ఎంపిక చేశారు.