HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Nara %e0%b0%af%e0%b1%81%e0%b0%b5%e0%b0%97%e0%b0%b3%e0%b0%82 %e0%b0%9a%e0%b0%bf%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%81 %e0%b0%b0%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2 %e0%b0%a6

Lokesh Nara : యువ‌గ‌ళం చిచ్చు! రాళ్ల దాడులు, లాఠీ చార్జి!!

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యువ‌గ‌ళం(Lokesh Nara) కేంద్రంగా రాళ్లు, చెప్పుల‌తో

  • By CS Rao Published Date - 01:38 PM, Sat - 1 April 23
  • daily-hunt
Lokesh Nara
Lokesh Nara 1

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కొన‌సాగుతోన్న యువ‌గ‌ళం(Lokesh Nara) కేంద్రంగా రాళ్లు, చెప్పుల‌తో వైసీపీ, టీడీపీ వ‌ర్గీయులు(Yuvagalam) ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ధ్వంసమైంది. తోపులాటలో రఘునాథ్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత రఘునాథ రెడ్డిని అరెస్టు చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పుట్టపర్తిలో భారీగా మోహరించిన పోలీసులు పట్టణంలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉందని వెల్ల‌డించారు.

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యువ‌గ‌ళం(Lokesh Nara)

ఎట్ట‌కేల‌కు పోలీస్ స్టేషన్ నుంచి సత్తెమ్మ ఆలయానికి చేరుకున్న పల్లె రఘునాథరెడ్డి అక్కడ ప్రమాణం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. శ్రీధర్ రెడ్డిపై పాదయాత్రలో లోకేశ్(Lokesh Nara) చేసిన ఆరోపణలన్నీ నిజమేనని తెలిపారు. ఎమ్మెల్యే వస్తే ఆధారాలతో నిరూపిస్తామని మరోసారి సవాల్ విసిరారు. దీంతో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రాళ్లు, చెప్పుల‌తో వైసీపీ, టీడీపీ వ‌ర్గీయులు  

టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జ‌రిగాయి. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పుట్టపర్తి రణరంగంగా మారింది. యువగళం(Yuvagalam) పాదయాత్ర సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు నారా లోకేష్ చేశారు. దీంతో లోకేశ్ ను, పల్లె రఘనాథరెడ్డిని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో శ్రీధర్ రెడ్డి పోస్టులు పెట్టారు. దీంతో పుట్టపర్తి అభివృద్ధిపై చర్చకు రావాలని పల్లె రఘునాథరెడ్డి సవాల్ విసిరారు.

Also Read : Yuvagalam : మైనార్టీల‌కు లోకేష్ హామీ! ముస్లింల‌ సంక్షేమానికి `ఇస్లామిక్ బ్యాంకు`!

ఈ నేపథ్యంలో సత్యమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు పల్లె రఘునాథ్‌రెడ్డి సిద్ధమయ్యారు. పుట్టపర్తి టీడీపీ ఆఫీసుకు ఆయన రాగా పోలీసులు అక్కడే ర‌ఘునాథ్ రెడ్డిని నిర్బంధించారు. మరోవైపు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. అయితే పల్లె రఘునాథ్ టీడీపీ కార్యాలయం గోడ దూకి పల్లె హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చారు. ఇద్దరు నేతలూ సత్యమ్మ దేవాలయానికి చేరుకున్నారు. సత్యమ్మ గుడి దగ్గరికి వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత(Yuvagalam) చోటు చేసుకుంది. లాఠీ ఛార్జి చేసి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు. యువ‌గ‌ళానికి కూడా అనుమ‌తి లేకుండా చేశారు. మాజీ మంత్రి లోకేష్ (Lokesh Nara)చేసిన ఆరోప‌ణ‌లు ఇరు వ‌ర్గాల‌ను ఘ‌ర్ష‌ణకు పురికొల్పాయి. దీంతో పాద‌యాత్ర‌ను. తాత్కాలికంగా పోలీసులు అడ్డుకున్నారు. తిరిగి మ‌ళ్లీ పాద‌యాత్ర ఎప్పుడు అనేది సందిగ్ధంగా ఉంది.

Also Read : Yuvagalam : ప‌ప్పు నుంచి ప‌వ‌ర్ ఫుల్‌! లోకేష్ `డైట్` సీక్రెట్స్‌ !

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పుట్టపర్తి రణరంగంగా మారింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ananthapur
  • Andhra Pradesh TDP
  • chandrababu naidu
  • Lokesh Nara
  • Puttaparthi
  • yuvagalam

Related News

Dussehra Festival

Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా అలంకారాల వైభవం 11 రోజులు

ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సెప్టెంబర్ 29న ములా నక్షత్రం రోజు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd