HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Lokesh Meets Telugu Diaspora Volunteers Calls For Them To Be Partners In State Development

Lokesh : తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో లోకేశ్ భేటీ..రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు

రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ రోజు నారా లోకేశ్‌ సింగపూర్‌లోని తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వాలంటీర్లు, తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

  • By Latha Suma Published Date - 01:30 PM, Mon - 28 July 25
  • daily-hunt
Lokesh meets Telugu diaspora volunteers.. calls for them to be partners in state development
Lokesh meets Telugu diaspora volunteers.. calls for them to be partners in state development

Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర మంత్రుల బృందం కూడా పాల్గొంటోంది. ముఖ్యంగా ఐటీ, విద్య మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ కూడా ఈ బృందంలో భాగమయ్యారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ రోజు నారా లోకేశ్‌ సింగపూర్‌లోని తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వాలంటీర్లు, తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వారితో మాట్లాడుతున్న సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. గత అయిదేళ్లలో రాష్ట్ర పాలన పూర్తిగా విధ్వంసాన్ని చవిచూసింది. అలాంటి సమయంలో కూడా విదేశాల్లో ఉన్న తెలుగువారు రాష్ట్రాన్ని కాపాడే లక్ష్యంతో ముందుకొచ్చారు. వారి నిబద్ధత, చిత్తశుద్ధి అభినందనీయం అన్నారు.

Read Also: Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..మూడు గేట్ల ద్వారా నీటి విడుదల

తెలుగువారి సంఘీభావమే తమకు బలమని పేర్కొన్న లోకేశ్‌ ఏ దేశానికి వెళ్లినా ముందుగా అక్కడి తెలుగు సముదాయాన్ని కలవాలనే నిర్ణయం సీఎం చంద్రబాబు గారు తీసుకున్నారు అని తెలిపారు. ఇది వారు రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమకు, ప్రజల పట్ల నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. సింగపూర్ అభివృద్ధి మోడల్‌ను ప్రస్తావిస్తూ, లోకేశ్‌ స్పష్టం చేశారు. ఈ నగరం అభివృద్ధిలో చేసిన ప్రయాణం మనందరికీ స్పూర్తిదాయకం. ఇక్కడి తెలుగువారు కూడా తమ విలువైన మద్దతుతో రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో డయాస్పోరా కీలక పాత్ర పోషించగలదని, అందుకు ప్రభుత్వం ప్రతి అవకాశం ఉపయోగించుకుంటుందన్నారు.

ఇక, ఇటీవల ఏర్పడిన డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి ఊపిరి లభించిందని మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం, సహకారం పెరిగినందువల్ల అభివృద్ధి పునరుత్థానం సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ పాత్రను గుర్తు చేస్తూ, ఆయన త్వరలో సింగపూర్ పర్యటనకు రావొచ్చని వెల్లడించారు. ఆ పర్యటనలో కూడా తెలుగువారు భారీ స్థాయిలో పాల్గొని, తమ మద్దతు చాటాలి అని పిలుపునిచ్చారు. ప్రధాని సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన మద్దతు అనూహ్యమైనది. అందుకే ప్రధాని మోడీ గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన వాలంటీర్లకు లోకేశ్‌ అభినందనలు తెలిపారు. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, ప్రతి ఒక్కరి సేవను గుర్తిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Aamir Khan : ఆమిర్ ఖాన్ ఇంటికి ఒకేసారి 25 మంది ఐపీఎస్‌లు…! అసలేం జరిగిందంటే?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Development
  • CM Chandrababu Naidu
  • Investments
  • Minister Lokesh
  • nara lokesh
  • Telugu community
  • Telugu diaspora

Related News

Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

కేంద్రం నుండి రాష్ట్రానికి అవసరమైన మద్దతు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతితో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ లోతుగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో ముఖ్యాంశంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు అంశం ప్రస్తావించబడింది.

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

  • Smart Kitchen

    Nara Lokesh: కడపలో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన నారా లోకేశ్

Latest News

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd