HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Key Decision Of Congress Party Ys Sharmila As Andhra Pradesh Pcc Chief

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల.. ప్రకటించిన పార్టీ అధిష్టానం

YS Sharmila : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల‌ను నియమించింది.

  • Author : Pasha Date : 16-01-2024 - 3:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Merger of YSRTP
Ys Sharmila

YS Sharmila : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల‌ను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

వైఎస్సార్ టీపీ పార్టీని స్థాపించిన షర్మిల.. ఇటీవల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో భేటీ అయ్యారు. వారు ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరే టైంలోనే.. ఆమెకు ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం నడిచింది. దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏపీ పీసీసీ చీఫ్‌ బాధ్యతలను ఆమెకు కట్టబెట్టింది. ఏపీలో వైఎస్సార్ సీపీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు వైఎస్సార్  కుటుంబానికే చెందిన షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలను అప్పగించడం ద్వారా హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను తన వైపునకు తిప్పుకునేందుకు సమాయత్తం అవుతోంది.

Also Read: CBN – Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌‌.. సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైఎస్సార్ సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చకచకా పావులు కదుతుపుతున్నాయి. కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హవా నడిపించిన కాంగ్రెస్ మాత్రం సైలెంట్ మోడ్‌లో కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకొన్ని నెలల టైమే ఉన్నందున.. చాలామంది నాయకులు పార్టీలు మారడం  మొదలుపెట్టారు. వైఎస్సార్ సీపీ చాలాచోట్ల కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో ఆయా చోట్ల సీట్లు దక్కనివారు టీడీపీలోకి జంప్ చేస్తున్నారు. ఇక కొత్తగా పాలిటిక్స్‌లోకి వస్తున్నవారు కూడా టీడీపీ, వైఎస్సార్ సీపీ, జనసేనలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి ఏపీలో కాంగ్రెస్‌కు ప్రజాదరణ ఎంతగా తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం(AP Congress) కసరత్తును మొదలుపెట్టింది.  ఈక్రమంలోనే ఏపీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలను అప్పగించింది.  షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్‌కు కొంత జోష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు ఉన్న పేరు.. గతంలో ఏపీలో పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన తీరు కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్లుగా మారే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి పార్టీలు మారుతున్న నాయకులు కాంగ్రెస్ పార్టీని అస్సలు లెక్కలోకే తీసుకోవడం లేదని పలువురు పరిశీలకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల.. జనంతో పార్టీకి కనెక్టివిటీని పెంచడం అనే అతిపెద్ద టాస్క్‌ను తొలుత పూర్తి చేయాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏపీ ప్రజలకు కాంగ్రెస్‌పై సన్నగిల్లిన నమ్మకాన్ని మళ్లీ పెంచేలా ప్రజలతో కాంగ్రెస్ శ్రేణులను మమేకం చేయించాలి. అలా అయితేనే పార్టీలు మారేందుకు రెడీ అవుతున్న నాయకులు.. కాంగ్రెస్ వైపు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP PCC CHIEF
  • congress party
  • ys sharmila

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • Telangana Cheyutha Pension

    రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!

  • Ktr Grampanchayithi

    అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు ఇక కాలం చెల్లింది – కేటీఆర్

  • Priyanka Be Given The Respo

    ప్రియాంక చేతికి ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు?

Latest News

  • ముచ్చటగా మూడోసారి మలైకా డేటింగ్, ఈసారి ఏకంగా తన కంటే 17 ఏళ్ల చిన్నోడితో ?

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd