Supreme Court : ఏపీ, తెలంగాణ నిర్బంధ చట్టాలపై `సుప్రీం` చివాట్లు
ఏపీకి మూడు రాజధానులు వద్దన్న వారిపై ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం(టీడీఏ)1986 కింద కేసులు ఎలా నమోదు చేస్తారని సుప్రీం ప్రశ్నించింది.
- By CS Rao Published Date - 04:19 PM, Thu - 25 November 21

ఏపీకి మూడు రాజధానులు వద్దన్న వారిపై ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం(టీడీఏ)1986 కింద కేసులు ఎలా నమోదు చేస్తారని సుప్రీం ప్రశ్నించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టీడీఏ చట్టం-1986ను దుర్వినియోగం చేసేలా ఉత్తర్వులు ఇచ్చాయని న్యాయమూర్తి నారీమన్ అభిప్రాయపడ్డారు. వాటి అమలు విషయంలో అధికారులు వ్యవహరిస్తోన్న తీరును హైకోర్టులు నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది. గత మూడేళ్లుగా టీడీఏ చట్టం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదు కాగా, వాటిని హైకోర్టులు సమర్థించడాన్ని తప్పుబట్టింది. టీడీఏ చట్టం ను అమలు చేస్తూ ఉత్వర్వులు ఇచ్చిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు హైకోర్టులకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి నారిమన్ చివాట్లు పెట్టడం సంచలనంగా మారింది.రెండు రాష్ట్రాల హైకోర్టులు ఈ చట్టానికి అనుగుణంగా ఇచ్చిన తీర్పులు చెల్లవని తేల్చేసింది. ఈ చట్టం క్రూరమైనదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి నారిమన్ అభిప్రాయ పడడం సంచలనం కలిగిస్తోంది. గత మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టం కింద 500 మంది పౌరులను నిర్భంధించింది. ఏపీ సర్కార్ 30 మందిని ఈ చట్టం కింద నిర్భంధించడాన్ని సుప్రీం సీరియస్ గా తీసుకుంది.టీడీఏ చట్టాన్ని వర్తింప చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం, 1986ను తెలంగాణ ప్రభుత్వం సవిరించింది. ప్రభుత్వానికి అనుకూలంగా విస్తరింప చేసి ఆమోదించిన విషయాన్ని సుప్రీం ప్రశ్నించింది.
కేసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులకు వ్యతిరేకంగా టీడీఏ చట్టాన్ని వర్తింప చేస్తున్నాయని సుప్రీం అభిప్రాయపడింది. 2019, 2020 మరియు 2021 సంవత్సరాల్లో ఈ చట్టం కింద ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన దాదాపు 70 తీర్పులను సుప్రీం పరిశీలించింది. ఈ మూడేళ్లలో, నిర్బంధ ఉత్తర్వులను సవాలు చేస్తూ 70 కేసులను విశ్లేషిస్తే కేవలం 25 కేసులకు మాత్రమే ఈ చట్టాన్ని సమర్థించేలా ఉన్నాయని అభిప్రాయపడింది.
“డిటెన్యూ చేసిన నేరాలను ఎదుర్కోవటానికి నిర్దిష్ట చట్టం ఉన్నప్పుడు, ‘కఠినమైన టీడీఏ లాంటి నిర్బంధ చట్టాన్ని అమలు చేయడం అమానుషమని సుప్రీం అభిప్రాయపడింది. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ ల మధ్య వ్యత్యాసాలను గమనించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా హైకోర్టులకు సూచించింది. ప్రభుత్వాల ఏకపక్ష నిర్బంధాలపై కోర్టుల విధానం స్థిరంగా లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిర్బంధ చట్టాల ద్వారా అసాధారణ విధానాలను అమలు చేయడం సాధారణ శిక్షా చట్టాలను భర్తీ చేయడం కాదని అభిప్రాయపడింది.లైంగిక వేధింపులు, మాదకద్రవ్యాల కేసుల్లో నిర్బంధ ఉత్తర్వులను సమర్థించేందుకు న్యాయస్థానాలు సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో నిర్బంధ ఉత్వర్వులు అవసరం అయినప్పటికీ, ఈ నేరాలు ఇప్పటికే సాధారణ చట్టాల క్రింద సమగ్రంగా ఉన్నాయనే విషయాన్ని హైకోర్టులు గుర్తించాలని సుప్రీం సూచించింది. చాలా సందర్భాల్లోసుప్రీం కోర్ట్ మార్గదర్శకాలను ఉల్లంఘించి నిర్బంధ ఉత్తర్వులను అమలు చేస్తున్నారని అభిప్రాయపడింది. ప్రధానంగా “లా అండ్ ఆర్డర్” నేరాలను “పబ్లిక్ ఆర్డర్” సమస్యలుగా మార్చేస్తున్నారని, బెయిల్ పొందే నిందితుడి హక్కును కాలరాయడానికి నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని అభిప్రాయపడింది.
Also Read : జూనియర్ పై టీడీపీ డైరెక్ట్ అటాక్!
బాణోత్ లచ్చు బాయి వర్సెస్ తెలంగాణా కేసులో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి కేవలం రెండు కేసులు నమోదైనట్లుగా, నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయబడినప్పుడు కూడా హైకోర్టులు నిర్బంధ ఉత్తర్వులను సమర్థించడాన్ని సుప్రీం తప్పు బట్టింది. మాదకద్రవ్యాలు, లా అండ్ ఆర్డర్ సమస్యగా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి “వ్యభిచారం, ఉగ్రవాదం వంటి నీచ కార్యకలాపాలకు” ఆజ్యం పోసే పబ్లిక్ ఆర్డర్ సమస్య అనే కారణంతో నిర్బంధ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానాలు టీడీఏ చట్టం లాంటి కార్యనిర్వాహక ఆదేశాలతో ఏకీభవిస్తున్నట్లయితే, నేరం తీవ్రత లేదా నేరం మళ్లీ జరిగే అవకాశం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా న్యాయవ్యవస్థ బుద్ధిహీనంగా బెయిల్ మంజూరు చేస్తుందని అర్థం. ఆ విషయాన్ని సుప్రీం తేల్చేసింది.నిర్బంధ చట్టాలు మూడు నెలలకు మించకుండా ఒక వ్యక్తిని నిర్బంధించడానికి అధికారులకు అవకాశం ఉంది. సలహా బోర్డుల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వాలు నిర్బంధాలను ఒక సంవత్సరం వరకు పొడిగించడం పరిపాటి. విశ్లేషించిన చాలా కేసులలో, డిటెనస్ వారి నిర్బంధ ఉత్తర్వులను హైకోర్టులు రద్దు చేయడానికి ముందే ఐదు నుండి ఎనిమిది నెలలు జైలులో గడిపిన విషయాన్ని సుప్రీం ప్రస్తావించింది.
ఈ రెండు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు నిర్బంధ చట్టాలను దుర్వినియోగం చేసినందుకు తమ ప్రభుత్వాలపై ఎటువంటి ఖర్చులు విధించకుండా తప్పించుకునే ఛాన్స్ ఉంది.తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు, నిరోధక నిర్బంధ చట్టాలు తప్పుగా వర్తింపజేయబడుతున్నాయని సుప్రీం గుర్తించింది. నిర్బంధ చట్టాలను అమలు చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని మాత్రమే ప్రభుత్వాలకు సూచించాయి. అయితే, ఈ మార్గదర్శకాలు చాలా వరకు విస్మరించబడ్డాయని అభిప్రాయపడుతోంది.ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, మోసపూరిత కారణాలతో శిక్షార్హత లేని వ్యక్తులను నిర్బంధించడానికి నిరోధక నిర్బంధ చట్టాలను ఉపయోగించాయని ఎత్తి చూపింది. ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన వారిపై నిరోధక నిర్బంధ చట్టాలను ఉపయోగించడం ఏమిటని ప్రశ్నించింది.ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను విచక్షణారహితంగా వర్తింపజేయడానికి సంబంధించి అధికారులను అదుపులో ఉంచడంలో ఉన్నత న్యాయస్థానాలు చురుకైన విధానాన్ని తీసుకోవాలని ఆదేశించింది. సాధారణ చట్టాల పరిధిలోకి వచ్చే కేసులను టీడీఏ చట్టం కింద నమోదు చేస్తే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అర్థరహితంగా మారుతుందని సుప్రీం చురకలు వేసింది.
Related News

1 Killed : అమెరికాలో స్విమ్మింగ్పూల్లో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి
అమెరికాలో హైదరాబాద్కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్లో పడి మునిగి మృతి చెందినట్లు అతని